Jagananna Amma Vodi: ఈనెల 11న రెండో విడత జగనన్న అమ్మ ఒడి ప్రారంభించనున్నట్లు ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. లాక్డౌన్ కారణంగా రాష్ట్రం ఆర్థికంగా నష్టపోయిందని, ఇచ్చిన మాట ప్రకారం అమ్మ ఒడి రెండో విడతను ఇస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రాష్ట్రంలోని మహిళలకు పెద్దపీట వేస్తున్నారని అన్నారు. అమ్మ ఒడితో పాటు మహిళా సంక్రాంతి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
కాగా, రెండో విడతలో నగదును తల్లుల ఖాతాల్లో జమ కానుంది. ఈ రెండో విడత అమ్మ ఒడి కార్యక్రమాన్ని నెల్లూరులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రారంభించనున్నారు. ఈ సారి గతంలోకంటే ఎక్కువ మంది లబ్దిదారులకు ఇస్తున్నారు. అర్హులైన వారందరికీ తప్పకుండా అందజేస్తామని ఆయన అన్నారు.