జ‌గ‌న్‌పై దాడి కేసు: హైకోర్టును ఆశ్రయించిన నిందితుడు శ్రీనివాసరావు

|

Sep 06, 2020 | 7:31 AM

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జగన్​పై కత్తితో దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావు... బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు.

జ‌గ‌న్‌పై దాడి కేసు: హైకోర్టును ఆశ్రయించిన నిందితుడు శ్రీనివాసరావు
Follow us on

విశాఖ ఎయిర్‌పోర్ట్‌లో జగన్​పై కత్తితో దాడి కేసు నిందితుడు శ్రీనివాసరావు… బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ కేసులో ఎన్​ఐఏ దర్యాప్తు కంప్లీట్ చేసి అభియోగపత్రం దాఖలు చేసినప్పటికీ… కోవిడ్ కార‌ణంగా విచారణపై అనిశ్చితి నెలకొందని పిటిషన్‌లో పేర్కొన్నాడు. 21 నెలలుగా జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నానని ఆవేద‌న వ్య‌క్తం చేశాడు. వృద్ధ తల్లిదండ్రులను పోషించాల్సిన బాధ్యత తనపై ఉందని, బెయిల్‌ ఇప్పిస్తే కోర్టు షరతులకు లోబడి ఉంటానని పిటిషన్‌లో విన్న‌వించాడు. బెయిల్‌ ఇవ్వ‌ని ప‌క్షంలో కనీసం 15 రోజుల్లో ఎన్​ఐఏ కోర్టులో సీఎం జగన్‌ సాక్ష్యం చెప్పేలా ఆదేశించాలని కోర్టును కోరాడు.

 

Also Read :

అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి రథం దగ్ధం

శిరోముండనం కేసులో నూతన్​ నాయుడుకు రిమాండ్