కరోనా బారినపడి ఇస్కాన్‌ చీఫ్ గురుభక్తిచారు స్వామి కన్నుమూత

| Edited By:

Jul 04, 2020 | 11:43 PM

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయ తాండవం చేస్తోంది. ఈ వైరస్ బారినపడి లక్షల మంది మరణిస్తున్నారు. తాజాగా.. ఇస్కాన్ చీఫ్ భక్తిచారు మహారాజ్ స్వామి శనివారం నాడు అమెరికాలో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా..

కరోనా బారినపడి ఇస్కాన్‌ చీఫ్ గురుభక్తిచారు స్వామి కన్నుమూత
Follow us on

కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా విలయ తాండవం చేస్తోంది. ఈ వైరస్ బారినపడి లక్షల మంది మరణిస్తున్నారు. తాజాగా.. ఇస్కాన్ చీఫ్ భక్తిచారు మహారాజ్ స్వామి శనివారం నాడు అమెరికాలో కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా ఆయన కరోనా బారినపడి ప్లోరిడాలో చికిత్స పొందుతున్నారు. జూన్ 18వ తేదీన తీవ్ర జ్వరంతో ఇబ్బందులు పడుతుండటంతో..
ఆయనకు కరోనా పరీక్షలు జరిపారు. దీంతో రిపోర్టులో ఆయనకు కరోనా పాజిటివ్ ఉన్నట్లు తేలింది. దీంతో ఆయనకు ప్లోరిడాలోని ఆస్పత్రిలో చికిత్స అందజేశారు. అయితే గత కొద్ది రోజులుగా ఆయన ఆరోగ్యం తీవ్రంగా విషమించడంతో.. ఆయనను వెంటిలేటర్‌లో ఉంచారు. అయితే మల్టీ ఆర్గాన్‌ వైఫల్యంతో శనివారం నాడు ఆయన కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇస్కాన్ సంస్థ పేర్కొంది.