ఇరాక్ మళ్ళీ రక్తసిక్తమైంది. రాజధాని బాగ్దాద్ నిరసనకారుల ఆందోళనతో అట్టుడికింది. పెద్దఎత్తున జరిగిన ప్రభుత్వ వ్యతిరేక ప్రదర్శనల్లో వేలాదిమంది పాల్గొన్నారు. శుక్రవారం బాగ్దాద్ లోని తహరీర్ స్క్వేర్ (గ్రీన్ జోన్) ప్రాంతానికి చేరుకున్న ఆందోళనకారులను అడ్డుకునేందుకు సాయుధ దళాలు రబ్బరు బులెట్లను, బాష్పవాయువును ప్రయోగించాయి. ఈ ఘర్షణల్లో 40 మంది మృతి చెందగా పలువురు గాయపడ్డారు. (ఈ జోన్ లో అనేక ప్రభుత్వ కార్యాలయాలు, విదేశీ ఎంబసీలు ఉన్నాయి). తమకు మరిన్ని ఉద్యోగావకాశాలు కల్పించాలని, ప్రజా సేవలు మెరుగుపరచాలని, అవినీతిని అంతమొందించాలని ముఖ్యంగా యువకులు డిమాండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా కూడా తమ ఆందోళన కొనసాగిస్తున్నారు. దేశ వ్యాప్తంగా జరిగిన అల్లర్లలో సుమారు 2 వేల మంది గాయపడ్డారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. బాగ్దాద్ నగరంలోని దివానియా పట్టణంలో పారామిలిటరీ కార్యాలయానికి నిప్పు పెట్టేందుకు వఛ్చిన నిరసనకారులను చెదరగొట్టేందుకు సైనికులు మొదట లాఠీచార్జి చేసి బాష్ప వాయువు ప్రయోగించారు. ఈ ఘర్షణల్లో 12 మంది మరణించారు ఆందోళనకారుల దాడుల్లో . భద్రతా దళాల్లోనూ కొందరు గాయపడ్డారు. ధీకార్ ప్రావిన్స్ లో ఓ ప్రభుత్వ కార్యాలయంలోనికి చొచ్ఛుకుపోయేందుకు దాదాపు మూడు వేలమంది ప్రయత్నించారు. ముతన్నా ప్రావిన్స్ లో షియా పొలిటికల్ కార్యాలయాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. వీరిలో చాలామంది ఇరాన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.