ఆ డిప్యూటీ హెల్త్ మినిస్టర్‌కు కరోనా పాజిటివ్.. అలసిపోయినట్లు ఉంటుందంటూ ట్వీట్!!

| Edited By:

Feb 26, 2020 | 12:20 AM

కరోనా.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. చైనాలో పుట్టిన ఈ వైరస్.. దాదాపు 30 దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే రెండు వేలకు పైగా దీని బారిన పడి మృతిచెందారు. మరో 80 వేల మందికిపైగా దీని ఎఫెక్ట్‌తో ఇబ్బందులు పడుతున్నారు. అయితే తాజాగా ఇరాన్‌ డిప్యూటీ ఆరోగ్య మంత్రి ఇరాజ్‌ హరిర్చీకి కూడా ఈ కరోనా వైరస్ సోకినట్లు ఆ దేశ అధికారులు మంగళవారం వెల్లడించారు. సోమవారం నాడు ఓ సమావేశంలో హాజరైన మంత్రి.. తీవ్ర జ్వరంతో […]

ఆ డిప్యూటీ హెల్త్ మినిస్టర్‌కు కరోనా పాజిటివ్.. అలసిపోయినట్లు ఉంటుందంటూ ట్వీట్!!
Follow us on

కరోనా.. ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి. చైనాలో పుట్టిన ఈ వైరస్.. దాదాపు 30 దేశాలను వణికిస్తోంది. ఇప్పటికే రెండు వేలకు పైగా దీని బారిన పడి మృతిచెందారు. మరో 80 వేల మందికిపైగా దీని ఎఫెక్ట్‌తో ఇబ్బందులు పడుతున్నారు. అయితే తాజాగా ఇరాన్‌ డిప్యూటీ ఆరోగ్య మంత్రి ఇరాజ్‌ హరిర్చీకి కూడా ఈ కరోనా వైరస్ సోకినట్లు ఆ దేశ అధికారులు మంగళవారం వెల్లడించారు.

సోమవారం నాడు ఓ సమావేశంలో హాజరైన మంత్రి.. తీవ్ర జ్వరంతో బాధపడుతున్నట్లు కనిపించాడని.. దీంతో ఆయనకు కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు ఆరోగ్య శాఖ మీడియా సలహాదారు అలిరెజా చెప్పారు. కరోనా పాజిటివ్ అని తేలడంతో.. మంత్రి తనంతట తానే.. మంగళవారం నిర్బంధంలోకి వెళ్లారు.

ఈ విషయాన్ని స్వయంగా ఆ మంత్రి.. తన అధికారిక ట్విటర్ ద్వారా తెలిపారు. నేను మీకు ఓ విషయం చెప్పాలనుకుంటున్నానని ట్వీట్ చేశారు. సోమవారం నాకు తీవ్రంగా జ్వరం వచ్చింది. వెంటనే పరీక్షలు చేయించుకోగా.. నాకు కొవిడ్‌ పాజిటివ్‌గా వైద్యులు గుర్తించారు. దీంతో కరోనా వైరస్‌ను జయించే వరకు.. తాను బయటకు రాకూడదని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం మందులు తీసుకోవడం ప్రారంభించానని. ఇప్పుడు పరిస్థితి సాధారణంగానే ఉందని ట్వీట్‌లో పేర్కొన్నారు. అయితే కాస్త అలసిపోయినట్లుగా కూడా ఉంటుందని.. రాబోయే రోజుల్లో ఆరోగ్య శాఖ చేస్తున్న కృషి, మీ అందరి దయతో ఈ కరోనా మహమ్మారిని జయిస్తాననుకుంటున్నాన్నారు. అయితే చాలామందికి వైరస్‌ సోకినప్పటికీ మన వద్ద మంచి వైద్య సదుపాయాలు ఉన్నాయని.. ప్రజలు ఈ వైరస్‌ సోకకుండా జాగ్రత్త వహించాలని సూచిస్తూ.. ట్వీట్‌ చేశారు.