IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ 178 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. ఆర్ఆర్ కెప్టెన్ స్టీవ్ స్మిత్(57) రాణించడంతో రాజస్థాన్ గౌరవప్రదమైన స్కోర్ సాధించగలిగింది. ఈ మ్యాచ్లో స్మిత్ టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు.
ఓపెనర్ రాబిన్ ఉతప్ప(41) మెరుపులతో రాయల్స్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచి దూకుడుగా ప్రారంభించింది. అయితే వరుస ఇంటర్వెల్స్లో రాజస్థాన్ జట్టు మూడు వికెట్లు కోల్పోవడంతో స్కోర్ బోర్డు నెమ్మదించింది. ఇక అప్పుడు కెప్టెన్ స్టీవ్ స్మిత్ 36 బంతుల్లో 57 పరుగులు చేయడంతో పాటు.. అతడికి బట్లర్(24), తెవాటియా(19) తోడవ్వడంతో రాయల్స్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. బెంగళూరు బౌలర్లలో చాహల్ రెండు వికెట్లు.. మోరిస్ నాలుగు వికెట్లు పడగొట్టారు.
Innings Break!
After opting to bat first, @rajasthanroyals post a total of 177/6 on the board.
Will #RCB chase this down?
Live – https://t.co/UcjyKWg2Lf #Dream11IPL pic.twitter.com/MGiCgZuZut
— IndianPremierLeague (@IPL) October 17, 2020