హిట్‌మ్యాన్‌ కెప్టెన్ ఇన్నింగ్స్.. ముంబై భారీ స్కోర్

|

Oct 01, 2020 | 9:36 PM

ఐపీఎల్‌-13వ సీజన్‌లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 192 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది.

హిట్‌మ్యాన్‌ కెప్టెన్ ఇన్నింగ్స్.. ముంబై భారీ స్కోర్
Follow us on

IPL 2020: ఐపీఎల్‌-13వ సీజన్‌లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 192 పరుగుల టార్గెట్‌ను నిర్దేశించింది. ఆరంభంలో ముంబై వరుసగా రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ(70).. ఇషాన్ కిషన్(28)తో కలిసి మధ్య ఓవర్లలో స్కోర్ బోర్డును ముందుకు కదిలించాడు. ఇక చివర్లో పొలార్డ్(47), హార్దిక్(30) మెరుపులు మెరిపించడంతో ముంబై భారీ స్కోర్ చేయగలిగింది. 20 ఓవర్లు ముగిసేసరికి ముంబై ఇండియన్స్ 4 వికెట్ల నష్టానికి 191 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో కాట్రెల్, గౌతమ్, షమీ చెరో వికెట్ పడగొట్టారు.