IPL 2020: ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్తో జరుగుతున్న మ్యాచ్లో కోల్కతా 165 పరుగుల టార్గెట్ను నిర్దేశించింది. కెప్టెన్ దినేష్ కార్తీక్(58), శుభ్మాన్ గిల్ (57) రాణించడంతో కేకేఅర్ గౌరవప్రదమైన స్కోర్ సాధించింది. ఈ మ్యాచ్లో కోల్కతా టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకుంది.
కోల్కతా ఇన్నింగ్స్ ప్రారంభంలో వరుసగా వికెట్లు కోల్పోయింది. అయితే ఒక ఎండ్ నుంచి గిల్ బౌండరీలు సాధిస్తూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు. ఇక గిల్కు, కెప్టెన్ దినేష్ కార్తీక్ తోడవ్వడంతో.. కోల్కతా నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. పంజాబ్ బౌలర్లలో అర్షదీప్, షమీ, రవి బిష్ణోయ్ చెరో వికెట్ పడగొట్టారు.
Also Read:
మ్యాక్స్వెల్.. ఎక్కడ నీ మ్యాడ్నెస్..!
సీఎస్కే ఓటమి.. జీవా ధోనిపై అసభ్యకర వ్యాఖ్యలు..