మంజ్రేకర్‌కు బీసీసీఐ షాక్.. వ్యాఖ్యాతల లిస్టులో నో ప్లేస్..

|

Sep 05, 2020 | 5:27 PM

టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్ సంజయ్‌ మంజ్రేకర్‌కు బీసీసీఐ షాకిచ్చింది. ఐపీఎల్ 2020 కామెంటేటర్ల జాబితాలో మంజ్రేకర్‌కు చోటు కల్పించలేదు.

మంజ్రేకర్‌కు బీసీసీఐ షాక్.. వ్యాఖ్యాతల లిస్టులో నో ప్లేస్..
Follow us on

IPL 2020 Commentators: టీమ్‌ఇండియా మాజీ క్రికెటర్‌, కామెంటేటర్ సంజయ్‌ మంజ్రేకర్‌కు బీసీసీఐ షాకిచ్చింది. ఐపీఎల్ 2020 కామెంటేటర్ల జాబితాలో మంజ్రేకర్‌కు చోటు కల్పించలేదు. ఏడుగురు వ్యాఖ్యాతలతో కూడిన ప్యానల్‌ను బీసీసీఐ ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆ లిస్టులో సునీల్‌ గవాస్కర్‌, శివ రామకృష్ణన్‌, మురళీ కార్తీక్‌, దీప్‌దాస్ ‌గుప్తా, రోహన్‌ గవాస్కర్‌, హర్ష భోగ్లే, అంజుమ్‌ చోప్రాలు ఉన్నారు.

కాగా, ఇటీవల కాలంలో మంజ్రేకర్ కొందరు ఆటగాళ్లు, సహచర వ్యాఖ్యాతలపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా రవీంద్ర జడేజాపై విమర్శలు చేసినందుకే మంజ్రేకర్‌ను బీసీసీఐ తప్పించినట్లు తెలుస్తోంది. ఐపీఎల్‌-2020 యూఏఈలో సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం కానుండగా.. అబుదాబీ, దుబాయ్‌ స్టేడియాల్లో చెరో 21, షార్జాలో 14 మ్యాచులు జరగనున్నాయి.

Also Read: గ్రామ సచివాలయ అభ్యర్థులకు ముఖ్య గమనిక.. 12 నుంచి ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు..