హైదరాబాద్ అబ్దుల్లాపూర్మెట్ ఎటిఎం సెంటర్ లో చోరీ జరిగింది. స్థానిక ఇండిక్యాష్ ఎటిఎం లోకి అర్థరాత్రి చొరబడ్డ దొంగలు, గ్యాస్ కట్టఏటీఎం మిషన్ కట్ చేసి చోరీకి పాల్పడ్డారు. ఏటీఎంలోని అన్ని ర్యాక్స్ లో ఉన్న నగదు అపహరించుకుపోయారు. స్థానికుల సమాచారంతో స్పాట్ చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి సీసీ టీవీ పుటేజ్ ను పరిశీలిస్తున్నారు. ఏటీఎంలో ఎంత నగదు పోయింది అనేది బ్యాంక్ అధికారులు వచ్చాకనే తెలుస్తుందంటున్నారు పోలీసులు.