సౌదీలో 450 మంది భారతీయులకు విముక్తి

|

Sep 27, 2020 | 6:33 PM

సౌదీ అరేబియాలో చిక్కుకున్న సుమారు 450 మంది భారతీయులు.. అక్కడి నిర్బంధ కేంద్రాల నుంచి విడుదలయ్యారు

సౌదీలో 450 మంది భారతీయులకు విముక్తి
Follow us on

కరోనా మహమ్మారి చేసిన కరాళనృత్యానికి వలస కూలీల బతుకు ఛిద్రమయ్యాయి. ఉన్న ఊరును కన్నవారిని వదిలి వలసపోయారు. కొవిడ్ విజృంభణ కారణంగా ఉన్న ఉఫాధిని కోల్పోయారు. లాక్ డౌన్ విధించడంతో పూట గడవడమే కష్టంగా మారిన రోజుల్లో భిక్షాయాట చేస్తూ జైలు పాలయ్యారు. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియాలో చిక్కుకున్న సుమారు 450 మంది భారతీయులు.. అక్కడి నిర్బంధ కేంద్రాల నుంచి విడుదలయ్యారు. ఇందులో కొంత మంది ఇప్పటికే భారత్ చేరుకోగా.. మరికొంత మంది బయల్దేరారు. వివరాల్లోకి వెళితే.. ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతుండటంతో మెజార్టీ దేశాలు లాక్‌డౌన్ విధించాయి. దీంతో ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఉపాధి, ఉద్యోగాలు కోల్పోయి రోడ్డునపడ్డారు. దీంతో పొట్టకూటి కోసం.. సౌదీ అరేబియాకు వెళ్లిన సుమారు వందలాది మంది భారతీయులు నిరాశ్రులయ్యారు. దీంతో వారు కడుపు నింపుకోవడటమే కష్టమైంది. ఈ క్రమంలో వారు అక్కడ భిక్షాటన చేశారు. భిక్షాటన చేయడాన్ని సౌదీలో నేరంగా పరిగణిస్తారు. ఈ నేపథ్యంలో వారిని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి, నిర్బంధ కేంద్రాలకు తరలించారు.

ఈ క్రమంలో వారు తమ సమస్యను సామాజిక కార్యకర్త ద్వారా భారత ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ప్రధాని నరేంద్ర మోదీ బంధీలుగా ఉన్నవారిని విడిపించాలని సౌదీ ప్రభుత్వాన్ని కోరారు. దీంతో స్పందించిన సౌదీ ప్రభుత్వం ఇవాళ 450 మంది భారతీయులను విడుదల చేసింది. రియాద్‌లోని భారత ఎంబసీ అధికారులు.. సౌదీ ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో సుమారు 450 మంది భారతీయులను సౌదీ ప్రభుత్వం శనివారం రోజు విడుదల చేసింది. 450 మందిని స్వదేశానికి తరలించడం కోసం ఎంబసీ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇందులో కొంత మంది ఇప్పటికే భారత్‌కు చేరుకోగా.. మరికొందరు కూడా త్వరలోనే వస్తారని భారత ఎంబసీ తెలిపింది.