Indian Players Isolation: ఐసోలేషన్‌లోకి ఇండియన్‌ క్రికెటర్స్‌.. వైరల్‌ వీడియోనే కారణం..

|

Jan 02, 2021 | 9:07 PM

Indian Cricketers Isolation: టీమిండియాకు చెందిన ఐదుగురు ఆటగాళ్లు న్యూఇయర్‌ వేడుకల్లో భాగంగా ఓ రెస్టారెంట్‌లో గడిపిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ అభిమాని...

Indian Players Isolation: ఐసోలేషన్‌లోకి ఇండియన్‌ క్రికెటర్స్‌.. వైరల్‌ వీడియోనే కారణం..
Follow us on

Indian Cricketers Isolation: ఇండియా, ఆస్ట్రేలియా జట్ల నడుమ టెస్ట్‌ సిరీస్‌ జరుగుతోన్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు మ్యాచ్‌లు జరగగా ఇరు జట్లు ఒక్కో విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తాజాగా జనవరి 7న జరగనున్న మూడో టెస్ట్‌కు ఇరు జట్లు సిద్దమవుతున్నాయి.
ఇదిలా ఉండగా తాజాగా టీమిండియాకు చెందిన ఐదుగురు ఆటగాళ్లు న్యూఇయర్‌ వేడుకల్లో భాగంగా ఓ రెస్టారెంట్‌లో గడిపిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓ అభిమాని క్రికెటర్ల బిల్లును తానే చెల్లించానని పోస్ట్‌ చేయడంతో వైరల్‌గా మారింది. అంతేకాకుండా రిషబ్‌ పంత్‌ ఆ అభిమానికి హగ్ కూడా ఇచ్చాడంటూ వార్తలు వచ్చాయి.. అయితే ఆ అభిమాని అలాంటిదేం లేదని క్లారిటీ ఇచ్చాడు. ఈ కారణంగా  క్రికెటర్లు కరోనా నిబంధనలను ఉల్లంఘించారంటూ ఆరోపణలు ఎదురయ్యాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టిన బీసీసీఐ, క్రికెట్‌ ఆస్ట్రేలియా ఆ ఐదురుగు క్రికెటర్లను ఐసోలేషన్‌లో ఉంచినట్లు తెలిపింది. రోహిత్‌శ‌ర్మ‌తోపాటు శుభ‌మ‌న్ గిల్‌, పృథ్వి షా, న‌వ్‌దీప్‌సైనీ, రిష‌బ్ పంత్‌ల‌ను మిగ‌తా టీమ్‌తో విడిగా ఉంచాల‌ని నిర్ణయించారు.

Also Read: Sourav Ganguly health latest update : దాదాకు పూర్తయిన యాంజియోప్లాస్టీ..డాక్టర్లు ఏం చెప్పారంటే..?