రెండో వన్డేః ఆ ఇద్దరూ ఇన్.. వీరిద్దరూ ఔట్..

|

Feb 08, 2020 | 7:44 AM

India Vs New Zealand: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ ఆక్లాండ్ వేదిక రెండో వన్డే జరుగుతోంది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన టీమిండియా.. ఈ వన్డేలో పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తొలి వన్డేలో భారత్ అద్భుతమైన బ్యాటింగ్‌తో అలరించినా.. బౌలింగ్, ఫీల్డింగ్‌లో మాత్రం నిరాశపరించింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా జట్టులో పలు మార్పులు చేసింది. పేసర్ మొహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చి.. […]

రెండో వన్డేః ఆ ఇద్దరూ ఇన్.. వీరిద్దరూ ఔట్..
Follow us on

India Vs New Zealand: భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఇవాళ ఆక్లాండ్ వేదిక రెండో వన్డే జరుగుతోంది. 3 వన్డేల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో ఓటమిపాలైన టీమిండియా.. ఈ వన్డేలో పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుందని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తొలి వన్డేలో భారత్ అద్భుతమైన బ్యాటింగ్‌తో అలరించినా.. బౌలింగ్, ఫీల్డింగ్‌లో మాత్రం నిరాశపరించింది. ఈ నేపథ్యంలోనే టీమిండియా జట్టులో పలు మార్పులు చేసింది. పేసర్ మొహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్‌లకు విశ్రాంతినిచ్చి.. వారి స్థానంలో నవదీప్ సైనీ, యుజేంద్ర చాహల్‌లను తీసుకున్నారు.

మరోవైపు తొలి వన్డే విజయంతో జోష్ మీద ఉన్న కివీస్.. ఈ వన్డేను కూడా చేజిక్కించుకుని సిరీస్ కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఎప్పటిలానే ఈ మ్యాచ్‌కు కూడా ఆ జట్టుకు సీనియర్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్ కీలకం కానున్నాడు. ఇక న్యూజిలాండ్‌కు జట్టులో రెండు మార్పులుతో బరిలోకి దిగింది. మార్క్ చాప్‌మెన్, బౌలర్ జామీసన్ జట్టులో వచ్చారు. కాగా, టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ ఎంచుకుంది. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తుందా.? సిరీస్‌ను సమం చేస్తుందా.? అన్నది వేచి చూడాలి.