India Coronavirus Update: దేశంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోనా.. 96.56 శాతానికి పెరిగిన రికవరీ రేటు

| Edited By: Pardhasaradhi Peri

Jan 16, 2021 | 11:48 AM

భారత దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. నిలకడగా కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో కొత్తగా 15,158 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి...

India Coronavirus Update: దేశంలో క్రమంగా తగ్గుముఖం పడుతున్న కరోనా.. 96.56 శాతానికి పెరిగిన రికవరీ రేటు
Follow us on

India Coronavirus Update: భారత దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుంది. నిలకడగా కేసులు నమోదవుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. గత 24 గంటల్లో కొత్తగా 15,158 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటి కంటే 432 కేసులు తక్కువ. శనివారం ఉదయం నాటికి దేశవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య మొత్తం 1,05,42,841కి చేరింది. మరోవైపు గత 24 గంటల్లో ఈ వైరస్ తో 175 మంది మృతి చెందారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 1,52,093లకు చేరుకుంది. ఇక గత 24 గంటల్లో మరో 16,977 మంది కొవిడ్‌ నుంచి కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు వైరస్‌ నుంచి కోలుకున్నవారి సంఖ్య 1,01,79,715కి పెరిగింది. రికవరీ రేటు 96.56శాతంగా ఉంది. శుక్రవారం 8,03,090 కరోనా పరీక్షలు నిర్వహించామని.. దీంతో దేశ వ్యాప్తంగా మొత్తం టెస్టుల సంఖ్య 18,57,65,491 లకు చేరుకుంది.

మరోవైపు కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు దేశ వ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభమైంది. దేశవ్యాప్తంగా 3006 కేంద్రాల్లో వాక్సిన్ ను ఇవ్వనున్నారు.

Also Read: ప్రపంచదేశాల్లో మరణమృదంగం మోగిస్తున్న కరోనా.. 20 లక్షలు దాటిన మరణాలు