IND VS AUS Test Match Live Updates: సిడ్నీ వేదికగా భారత్, ఆస్ట్రేలియాల మధ్య మూడో టెస్ట్ మ్యాచ్ గురువారం ప్రారంభమైంది. ఇందులో భాగంగా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆస్ట్రేలియాకు ముందుగానే ఎదురుదెబ్బ తగిలింది. డేవిడ్ వార్నర్ కేవలం 5 పరుగులకే వెనుదిరిగాడు. మహ్మద్ సిరాజ్ బౌలింగ్లో పుజారాకు క్యాచ్ ఇచ్చి వార్నర్ ఔటయ్యాడు. ఇక ఆస్ట్రేలియా 7 ఓవర్లలో 21/1 స్కోరుతో ఆట కొనసాగిస్తోంది. వర్షం కారణంగా ఆటకు మరోసారి అంతరాయం కలిగింది.
ఆట మొదలయ్యే సమయంలోనూ వర్షం అంతరాయం కలిగించడంతో మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. మ్యాచ్ మొదలైన కొద్ది సమయానికే మరోసారి వర్షం రావడంతో అంపైర్లు ముందుగానే లంచ్ బ్రేక్ను ప్రకటించారు. ఇక మొదటి రెండు మ్యాచ్లకు అందుబాటులో లేని రోహిత్ శర్మ.. మూడో టెస్టులో చోటు దక్కించుకున్నాడు. అంతేకాకుండా ఈ టెస్టు మ్యాచ్కు వైస్ కెప్టెన్గా బాధ్యతలు చేపడుతోన్న విషయం తెలిసిందే.
Also Read: మూడో టెస్టు మ్యాచ్: టీమిండియా జట్టును ప్రకటించిన బీసీసీఐ.. నటరాజన్కు దక్కని చోటు..