అమెరికాను ఓవర్‌ టేక్ చేసిన చైనా.. 40 ఏళ్లలో ఇదే తొలిసారి..!

| Edited By: Pardhasaradhi Peri

Apr 08, 2020 | 5:27 PM

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ పంజా విసురుతోంది. అగ్రరాజ్యంగా ఎదగాలనేది చైనాకు ఎప్పటినుంచో ఉన్న బలమైన కోరిక. అయితే ఈ దిశగా చాలా కాలం

అమెరికాను ఓవర్‌ టేక్ చేసిన చైనా.. 40 ఏళ్లలో ఇదే తొలిసారి..!
Follow us on

కోవిద్ 19 ధాటికి ప్రపంచ దేశాలన్నీ చిగురుటాకులా వణికిపోతున్నాయి. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ పంజా విసురుతోంది. అగ్రరాజ్యంగా ఎదగాలనేది చైనాకు ఎప్పటినుంచో ఉన్న బలమైన కోరిక. అయితే ఈ దిశగా చాలా కాలం క్రితమే అక్కడి ప్రభుత్వాలు పగడ్బందీగా అడుగులు వేయడం మొదలెట్టాయి. ఆ ప్రయత్నాల ఫలితాలన్ని గత దశాబ్దకాలంగా మెల్లమెల్లగా వెలుగులోకి వస్తున్నాయి. ఇంతకీ మ్యాటరేంటంటే.. ప్రపంచంలో అత్యధికంగా పేటెంట్ల కోసం దరఖాస్తు చేస్తున్న దేశాల జాబితాలో చైనా అగ్ర స్థానానికి చేరకుంది. గత 40 ఏళ్లుగా అమెరికాకు మాత్రమే పరిమితమైన ఈ స్థానాన్ని తాజాగా చైనా హస్తగతం చేసుకుంది.

కాగా.. ప్రపంచ దేశాల మధ్య పేటెంట్ ఒప్పందం కుదిరింది మొదలు అమెరికా సంస్థలే ఇప్పటి వరకూ తమ ఆవిష్కరణలపై అధిక సంఖ్యలో పేటేంట్ల కోసం దరఖాస్తూ చేస్తూ వచ్చాయి. తాజాగా చైనా సంస్థలు అమెరికాను అధికమించాయి. గత 20 ఏళ్లలో చైనా కంపెనీల పెటెంట్ల దరఖాస్తుల్లో 200 శాతం వృద్ది నమోదైందని ప్రపంచ మేథోసంపత్తి హక్కుల సంస్థ వద్ద నమోదైన గణాంకాలు సూచిస్తున్నాయి. ఇక అత్యథిక సంఖ్యలో పేటెంట్లకు దరఖాస్తు చేస్తున్న కార్పొరేట్ సంస్థగా చైనాకు చెందిన హువావే అవతరించింది. గత మూడేళ్లుగా సదరు సంస్థ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది.