విషాదం.. చెక్​డ్యాములో పడి ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి..

|

Jul 01, 2020 | 7:39 PM

అనంతపురం జిల్లా తలుపుల మండలం మడుగు తండాలో విషాదం చోటుచేసుకుంది. తండా ద‌గ్గ‌ర్లోని చెక్ డ్యాములో పడి ఓ ట్రిపుల్ ఐటీ విద్యార్థి ప్రాణాలు విడిచాడు.

విషాదం..  చెక్​డ్యాములో పడి ట్రిపుల్ ఐటీ విద్యార్థి మృతి..
Follow us on

అనంతపురం జిల్లా తలుపుల మండలం మడుగు తండాలో విషాదం చోటుచేసుకుంది. తండా ద‌గ్గ‌ర్లోని చెక్ డ్యాములో పడి ఓ ట్రిపుల్ ఐటీ విద్యార్థి ప్రాణాలు విడిచాడు. గ్రామానికి చెందిన లోకేశ్ నాయక్ ట్రిపుల్ ఐటీ ఇడుపులపాయలో సెకండ్ ఇయ‌ర్ చదువుతున్నాడు.

ఇటీవల భారీగా వ‌ర్షాలు కురుస్తోన్న నేప‌థ్యంలో చెక్ డ్యామ్​లోకి భారీగా నీరు చేరింది. ఈ క్ర‌మంలో నీటిని చూసేందుకు డ్యామ్ వద్దకు వెళ్లిన స్టూడెంట్ ప్రమాదవశాత్తు నీటిలోకి ప‌డిపోయాడు. నీళ్ల‌ ప్రవాహం అధికంగా ఉండటం, ఈత రాకపోవ‌డంతో లోకేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లిని ప‌రిశీలించి..కేసు న‌మోదు చేశారు.