తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం.. నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి..

| Edited By:

Sep 25, 2019 | 8:53 AM

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. జనాలు రోడ్ల పైకి రావాలంటే జంకుతున్నారు. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు, కాలనీలు జలమయం అయ్యాయి. నాలాలు ఉప్పొంగి వరద నీరు రోడ్ల పైకి చేరడంతో.. రోడ్లు చెరువులను తలపించాయి. దీంతో హహనదారులు ఎటూ కదల్లేక గంటలపాటు రోడ్ల పైనే ఉండిపోయారు. వర్షం కారణంగా మధ్యాహ్నమే చీకట్లు కమ్ముకుంటున్నాయి. హైదరాబాద్‌లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎర్రగడ్డ, ఎస్ […]

తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షం.. నాలాలో కొట్టుకుపోయిన వ్యక్తి..
Follow us on

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. జనాలు రోడ్ల పైకి రావాలంటే జంకుతున్నారు. రెండు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో పలు ప్రాంతాలు, కాలనీలు జలమయం అయ్యాయి. నాలాలు ఉప్పొంగి వరద నీరు రోడ్ల పైకి చేరడంతో.. రోడ్లు చెరువులను తలపించాయి. దీంతో హహనదారులు ఎటూ కదల్లేక గంటలపాటు రోడ్ల పైనే ఉండిపోయారు. వర్షం కారణంగా మధ్యాహ్నమే చీకట్లు కమ్ముకుంటున్నాయి. హైదరాబాద్‌లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, పంజాగుట్ట, అమీర్ పేట్, ఎర్రగడ్డ, ఎస్ ఆర్ నగర్, మూసాపేట, ఖైరతాబాద్, కోఠి, ఉప్పల్, కూకట్ పల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తూనే ఉంది. మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. వర్షం కారణంగా నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక వర్షాలకు నగరంలోని హోర్డింగులు, పాత భవనాలు ఎక్కడ కూలుతాయోనని భయపడుతున్నారు. ఫెక్సీలు చిరగడం, హోర్టింగులు పడకుండా జీహెచ్ఎంసీ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక మెట్రో ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

వర్షాల కారణంగా ప్రధాన రహదారులు సైతం చెరువులను తలపించాయి. నగరవ్యాప్తంగా మొత్తం 14 చెట్లు నేలకొరిగాయి. కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి మేయర్ బొంతు రామ్మోహన్ పరిస్థితిని పర్యవేక్షించారు. నగరంలో 42 ప్రాంతాల్లో నీటి నిల్వలు ఉన్నట్లు గుర్తించామని ఆయన చెప్పారు. మాన్ సూన్ ఎమర్జెన్సీ, డిజాస్టర్ రెస్క్యూ బృందాలు నీటినీ క్లియర్ చేస్తున్నామని అన్నారు. వరద ఉధృతికి పలు వాహనాలు కొట్టుకుపోయాయి. బీజేఆర్ నగర్, సత్తిరెడ్డి కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఇక ఎర్రగడ్డ ప్రేమ్ నగర్‌లోనూ అదే పరిస్థితి.

వర్షం ధాటికి రోడ్ల పై నీరు చేరడంతో నాగోల్ ఆదర్శ్‌నగర్‌లో నాలాలో ఓ వ్యక్తి పడిపోయాడు. దీంతో వెంటనే సమాచారం అందుకున్న ఎన్‌ఫోర్స్‌‌మెంట్ విభాగం సిబ్బంది హుటాహుటిన వచ్చి నాలాలో కొట్టుకుపోయిన అతన్ని కాపాడారు. అయితే నాలాలో వర్షపు నీటిని తాగి ఆ వ్యక్తి స్వల్ప అస్వస్థతకు గురయ్యాడు.