బెయిల్ పై హాంకాంగ్ మీడియా టైకూన్ జిమ్మీ లై విడుదల

| Edited By: Pardhasaradhi Peri

Aug 12, 2020 | 11:28 AM

హాంకాంగ్ మీడియా టైకూన్ జిమ్మీ లై, ప్రజాస్వామ్య అనుకూల సభ్యురాలు ఏన్స్ బ్రో బెయిలుపై విడుదలయ్యారు. చైనా పోలీసులు వీరిని ఈ నెల 10 న అరెస్టు చేశారు. హాంకాంగ్ లో..

బెయిల్ పై హాంకాంగ్ మీడియా టైకూన్ జిమ్మీ లై విడుదల
Follow us on

హాంకాంగ్ మీడియా టైకూన్ జిమ్మీ లై, ప్రజాస్వామ్య అనుకూల సభ్యురాలు ఏన్స్ బ్రో బెయిలుపై విడుదలయ్యారు. చైనా పోలీసులు వీరిని ఈ నెల 10 న అరెస్టు చేశారు. హాంకాంగ్ లో ‘యాపిల్’ డైలీ అధిపతి అయిన జిమ్మీ.. విదేశీ శక్తులతో కుమ్మక్కయ్యారని, హాంకాంగ్ లో ప్రజాస్వామ్య అనుకూలుర ఆందోళనలను ప్రోత్సహిస్తున్నారని చైనా ఆరోపిస్తోంది. తాము తెచ్చిన కొత్త జాతీయ భద్రతా చట్టం కింద ఆయనను అరెస్టు చేసింది. అయితే 38 వేల 461 డాలర్లు, మరో 25 వేల 805 డాలర్ల పూచీకత్తుపై ఆయన విడుదలయ్యారు. తన లాయర్లు వెంట రాగా జిమ్మీ.. బుధవారం పోలీసు కస్టడీ నుంచి బయటకు వచ్చారు. వందలాది ప్రజాస్వామ్య అనుకూలవాదులు ఆయన రాగానే.. ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు.

నిరంకుశ విధానాలు అంతమయ్యేవరకు పోరాడుదాం అంటూ స్లొగన్స్ ఇచ్చారు. మరోవైపు జిమ్మీ ఇద్దరు కొడుకులు కూడా బెయిలుపై రిలీజయ్యారు. హాంకాంగ్ లో జిమ్మీ నిర్వహిస్తున్న యాపిల్ డైలీని’ కాపాడుకుంటామని ‘అనేకమంది ‘ప్రమాణం’ చేశారు.