నో వర్రీస్..రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి దత్తాత్రేయ

|

Mar 09, 2020 | 2:26 PM

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారని ఈ రోజు ఉదయం వార్తలు వచ్చాయి. ఆయనకు ఛాతి నొప్పి రావడంతో ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే హైదర్‌గూడా అపోలో ఆస్పత్రికి తరలించాని ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై అపోలో ఆస్పత్రి డైరెక్టర్ సంగీత రెస్పాండ్ అయ్యారు. దత్తాత్రేయ నార్మల్ పరీక్షల కోసమే ఆయన ఆసుపత్రికి వచ్చారని, 1998 సంవత్సరం నుండి కార్డియాలజిస్ట్ శ్రీనివాసరావు దగ్గరే చికిత్స చేయించుకుంటున్నారని తెలిపారు.ఈ విషయాన్ని దత్తాత్రేయ పీఏ […]

నో వర్రీస్..రెగ్యులర్ చెకప్ కోసమే ఆస్పత్రికి దత్తాత్రేయ
Follow us on

హిమాచల్ ప్రదేశ్ గవర్నర్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ అస్వస్థతకు గురయ్యారని ఈ రోజు ఉదయం వార్తలు వచ్చాయి. ఆయనకు ఛాతి నొప్పి రావడంతో ఫ్యామిలీ మెంబర్స్ వెంటనే హైదర్‌గూడా అపోలో ఆస్పత్రికి తరలించాని ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. దీనిపై అపోలో ఆస్పత్రి డైరెక్టర్ సంగీత రెస్పాండ్ అయ్యారు. దత్తాత్రేయ నార్మల్ పరీక్షల కోసమే ఆయన ఆసుపత్రికి వచ్చారని, 1998 సంవత్సరం నుండి కార్డియాలజిస్ట్ శ్రీనివాసరావు దగ్గరే చికిత్స చేయించుకుంటున్నారని తెలిపారు.ఈ విషయాన్ని దత్తాత్రేయ పీఏ నగేశ్ కూడా ధృవీకరించారు. డాక్టర్ రెండు చెకప్‌లు అదనంగా రాయడం వల్ల ఆలస్యం అయ్యిందని, అందుకే నేటి మధ్యాహ్నం హిమాచల్‌ప్రదేశ్ వెళ్ళాల్సిన ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకున్నామని తెలిపారు.