పులిచింతల ఉగ్రరూపం.. అమరావతి – విజయవాడ మధ్య రాకపోకలు కట్

|

Oct 17, 2020 | 11:04 AM

పులిచింతల ప్రాజక్టు భారీగా తరలివచ్చిన వరద నీటితో ఉగ్రరూపం దాల్చింది. దీంతో15 గేట్ల ద్వారా ఆరు లక్షల క్యూసెక్కులు నీరు దిగువకు విడుదల చేశారు అధికారులు. ఫలితంగా దిగువకు భారీగా వరదనీరు ప్రవహిస్తుండటంతో కృష్ణాపరివాహక ప్రాంతాలలో అనేక గ్రామలు, పంటపొలాలు ముంపుకు గురవుతున్నాయి. పలుగ్రామాలలో వందల ఎకరాలలో పంటలు నీటమునిగాయి. అమరావతి, అచ్చంపేట పరిసర గ్రామాలలోని పంటపొలాలు వరదముంపులో చిక్కుకున్నాయి. పెద్దమద్దూరులో ప్రధాన రహదారిపై ఆరు అడుగులమేర వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో అమరావతి – విజయవాడ మధ్య […]

పులిచింతల ఉగ్రరూపం.. అమరావతి - విజయవాడ మధ్య రాకపోకలు కట్
Follow us on

పులిచింతల ప్రాజక్టు భారీగా తరలివచ్చిన వరద నీటితో ఉగ్రరూపం దాల్చింది. దీంతో15 గేట్ల ద్వారా ఆరు లక్షల క్యూసెక్కులు నీరు దిగువకు విడుదల చేశారు అధికారులు. ఫలితంగా దిగువకు భారీగా వరదనీరు ప్రవహిస్తుండటంతో కృష్ణాపరివాహక ప్రాంతాలలో అనేక గ్రామలు, పంటపొలాలు ముంపుకు గురవుతున్నాయి. పలుగ్రామాలలో వందల ఎకరాలలో పంటలు నీటమునిగాయి. అమరావతి, అచ్చంపేట పరిసర గ్రామాలలోని పంటపొలాలు వరదముంపులో చిక్కుకున్నాయి. పెద్దమద్దూరులో ప్రధాన రహదారిపై ఆరు అడుగులమేర వరదనీరు ప్రవహిస్తోంది. దీంతో అమరావతి – విజయవాడ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.