ఈసారి రుతుపవనాలు సరైన సమయానికే పలకరించాయి. దేశమంతటా విస్తరించి వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. ఢిల్లీలో అకస్మాత్తుగా వాతావరణం మారిపోయింది. రాత్రి నుంచి కుండపోతగా వర్షం కురుస్తోంది. ఢిల్లీవాసులకు ఇది కాస్త ఉపశమనం కలిగించింది. అయితే భారీ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. మరో రెండు రోజులు ఢిల్లీతో పాటు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ అంచనా వేసింది.
ఈ క్రమంలో ద్వారక ప్రాంతంలోని అండర్పాస్, మింటో బ్రిడ్జ్ అండర్పాస్ నీట మునిగింది. భారత వాతావరణశాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో ఆగస్టులో సాధారణం కంటే 72 శాతం తక్కువ వర్షపాతం నమోదయ్యింది. గత ఏడాది ఆగస్టు మొదటి 12 రోజుల్లో దేశ రాజధానిలో 37.1 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసింది. భారీ వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ సూచించింది.
[svt-event date=”13/08/2020,10:30AM” class=”svt-cd-green” ]
Delhi: Waterlogging at an underpass in Dwarka area following rainfall. India Meteorological Department (IMD) has predicted ‘generally cloudy sky with heavy rain’ in the national capital today. pic.twitter.com/VoD0pfrfAJ
— ANI (@ANI) August 13, 2020
Read More: