జీహెచ్ఎంసీ ఎన్నికల కౌంటింగ్ తుది దశకు చేరుకుంటోంది. . గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల్లో టీఆర్ఎస్ దూకుడును ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు వెలువడ్డ ఫలితాల్లో టీఆర్ఎస్ అత్యధిక డివిజన్లలో తన ఆధిక్యాన్ని ప్రదర్శిస్తూ ముందంజలో నిలుస్తోంది. ఇప్పటి వరకు 103 స్థానాల ఫలితాలు వెల్లడి కాగా, టీఆర్ఎస్-42, ఎంఐఎం-39, బీజేపీ-23, కాంగ్రెస్-2 స్థానాలు దక్కించుకున్నాయి. ఇంకా 42 డివిజన్లలో కౌంటింగ్ కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే, అటు గులాబీ శ్రేణులు మాత్రం సంబరాల్లో మునిగిపోయారు. వస్తున్న ఫలితాలను బట్టి టీఆర్ఎస్ శ్రేణులు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే ప్రగతి భవన్లో కార్యకర్తలు, నేతలు, గెలిచిన అభ్యర్థుల అనుచరులు స్వీట్లు పంచుకుని.. పటాసులు పేల్చి సంబురాలు చేసుకుంటున్నారు.