సామాన్యులకు మరో షాక్, పెరగనున్న టీవీల ధరలు

|

Sep 21, 2020 | 7:46 PM

మధ్యతరగతి వారి మరో షాక్ తగలనుంది. టీవీల ధరలు అక్టోబర్ నుంచి పెరగబోతున్నాయి. టీవీల తయారీలో ఉపయోగించే కీలకమైన ఓపెన్‌ సెల్‌ ఇంపోర్ట్స్ పై అక్టోబర్‌ 1 నుంచి కేంద్ర సర్కార్ 5 శాతం సుంకాన్ని మళ్లీ అమల్లోకి తేనున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. స్వదేశంలో వీటిని తయారు చేసేందుకు మరికొంత సమయం కావాలని గతేడాది పరిశ్రమలు కోరడంతో ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 దాకా కస్టమ్స్‌ సుంకం నుంచి ప్రభుత్వం మినహాయింపునిచ్చినట్లు వివరించాయి. ఈ […]

సామాన్యులకు మరో షాక్, పెరగనున్న టీవీల ధరలు
Follow us on

మధ్యతరగతి వారి మరో షాక్ తగలనుంది. టీవీల ధరలు అక్టోబర్ నుంచి పెరగబోతున్నాయి. టీవీల తయారీలో ఉపయోగించే కీలకమైన ఓపెన్‌ సెల్‌ ఇంపోర్ట్స్ పై అక్టోబర్‌ 1 నుంచి కేంద్ర సర్కార్ 5 శాతం సుంకాన్ని మళ్లీ అమల్లోకి తేనున్నట్లు ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి. స్వదేశంలో వీటిని తయారు చేసేందుకు మరికొంత సమయం కావాలని గతేడాది పరిశ్రమలు కోరడంతో ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 దాకా కస్టమ్స్‌ సుంకం నుంచి ప్రభుత్వం మినహాయింపునిచ్చినట్లు వివరించాయి. ఈ గడువు ముగుస్తుండటంతో అక్టోబర్‌ 1 నుంచి మళ్లీ 5 శాతం సుంకం అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.

సుంకం విధింపుతో టీవీల రేట్లు సుమారు 4 శాతం వరకు పెరుగుతాయని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 32 అంగుళాల టీవీల రేట్లు రూ. 600 మేర, 42 అంగుళాల టీవీ రేట్లు రూ. 1,200–1,500 దాకా పెరుగుతాయని వెల్లడించాయి. అయితే, ఓపెన్‌ సెల్‌ ప్రాథమిక ధరను బట్టి చూస్తే ఇంపోర్ట్ ట్యాక్స్ భారం రూ. 150–250కి మించదని ఆర్థిక శాఖ వర్గాలు వివరించాయి. ఓపెన్‌ సెల్‌ వంటి  ఉత్పత్తులను ఎప్పుడూ ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటూ ఉంటే దేశీయంగా టీవీల తయారీ రంగం ముందుకు వెళ్లలేదని పేర్కొన్నాయి.

Also Read :

ఏపీలో ఒక్కసారిగా పెరిగిన కోడిగుడ్డు ధర !

రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ !