Breaking : అన్​లాక్​-2 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం..

|

Jun 30, 2020 | 12:12 AM

అన్​లాక్​-2 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. జులై 31వరకు కంటైన్​మెంట్​ జోన్లలో లాక్​డౌన్​ కొనసాగుతుందని వెల్ల‌డించింది. ఈ జోన్లలో నిత్యావసర సేవలకు మాత్రమే ప‌ర్మిష‌న్ ఉంటుందని తెలిపింది.

Breaking : అన్​లాక్​-2 మార్గదర్శకాలను విడుదల చేసిన కేంద్రం..
Follow us on

అన్​లాక్​-2 మార్గదర్శకాలను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. జులై 31వరకు కంటైన్​మెంట్​ జోన్లలో లాక్​డౌన్​ కొనసాగుతుందని వెల్ల‌డించింది. ఈ జోన్లలో నిత్యావసర సేవలకు మాత్రమే ప‌ర్మిష‌న్ ఉంటుందని తెలిపింది. బుధవారం నుంచి ఈ నిబంధనలు అమలులోకి రానున్నాయి.

  • కంటైన్‌మెంట్ జోన్లలో జులై 31 లాక్‌డౌన్‌ పొడిగింపు

కంటైన్‌మెంట్ జోన్ల వెలుప‌ల‌..

  • విద్యాసంస్థలు, కోచింగ్ సెంటర్లు, అంతర్జాతీయ విమాన ప్రయాణాలపై నిషేధం కొనసాగింపు
  • హోంమంత్రిత్వ శాఖ మార్గదర్శకాల మేరకే అంతర్జాతీయ ప్రయాణికులకు అవకాశం
  • మెట్రో రైల్, సినిమా హాళ్లు, జిమ్ములు, స్విమ్మింగ్ పూల్స్, సమావేశ మందిరాలు, వినోద పార్కులపైనా కొనసాగనున్న నిషేధం
  • రాజకీయ, ఆధ్యాత్మిక సభలు, సమావేశాలపైనా నిషేధం
  • రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకే కర్ఫ్యూ ఉంటుందని ప్రకటన
  • బయట తిరిగే వారికి మాస్క్ త‌ప్ప‌నిస‌రి
  • ప్రతి ప్రదేశంలో 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి
  • వివాహం, వివాహ సంబంధిత కార్యక్రమాలకు 50 మందికి మించి ప‌ర్మిష‌న్ లేదు
  • అంత్యక్రియల్లో 20 మందికే అనుమతి
  • బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం, పాన్‌, గుట్కా నమలడం, పొగాకు ఉత్పత్తులు తీసుకోవడం నిషేధం
  • నిర్దేశిత నియమాల ప్రకారం అంతర్రాష్ట్ర, అంతర్గత ప్రయాణికుల సర్వీసులు కొనసాగింపు
  • అవకాశం ఉన్న‌ మేరకు వ‌ర్క్ ఫ్ర‌మ్ చేయాలి