రైతులకు శుభవార్త‌

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 1:36 PM

  మోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అధికారికంగా ప్రారంభించడానికి రెడీ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఆదివారం (ఫిబ్రవరి 24) నిర్వహించే రైతు ర్యాలీలో ప్రధాని మోదీ ఈ పథకాన్ని ఆవిష్కరించనున్నారు. దీంతో 12.5 కోట్ల మంది రైతులకు ఒక్కోక్కరికి తొలి విడత కింద రూ.2,000 అందనుంది. ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన రైతులకు ఏడాదికి రూ.6,000 చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌లోనే ప్రతిపాదించింది. మూడు విడతల్లో రైతులకు […]

రైతులకు శుభవార్త‌
Follow us on

 

మోదీ ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అధికారికంగా ప్రారంభించడానికి రెడీ అయ్యింది. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో ఆదివారం (ఫిబ్రవరి 24) నిర్వహించే రైతు ర్యాలీలో ప్రధాని మోదీ ఈ పథకాన్ని ఆవిష్కరించనున్నారు. దీంతో 12.5 కోట్ల మంది రైతులకు ఒక్కోక్కరికి తొలి విడత కింద రూ.2,000 అందనుంది.

ఐదు ఎకరాల లోపు వ్యవసాయ భూమి కలిగిన రైతులకు ఏడాదికి రూ.6,000 చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌లోనే ప్రతిపాదించింది. మూడు విడతల్లో రైతులకు ఈ మొత్తం అందుతుంది. కేంద్రం ఒక్కో రైతు అకౌంట్‌లోకి రూ.2,000 చొప్పున మొదటి విడత నగదును బదిలీ చేయనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరికల్లా తొలి విడత కింద ఇవ్వాల్సిన రూ.2,000 రైతుల అకౌంట్లలో నేరుగా జమ చేయనుంది. మరోవైపు ఇప్పటికే దేశంలోని అన్ని రాష్ట్రాలు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి అర్హులైన రైతుల బ్యాంకు అకౌంట్ వివరాలను పీఎం కిసాన్ పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తున్నాయి.