దొంగలు ఎన్ని కొత్త దార్లు వెదుకుతున్న…పోలీసులు ఇట్టే పసిగడుతున్నారు. కోట్ల విలువ చేసే బంగారం, వజ్రాలను విదేశాల నుంచి అక్రమంగా స్వదేశానికి తెచ్చుకోవడానికి పడరాని పాట్లు పడుతున్నారు. చెన్నై ఎయిర్పోర్టులో మళ్లీ కోటి పాతిక లక్షలు విలువ చేసే గోల్డ్తో పాటు ఫారెన్ కరెన్సీని సీజ్ చేశారు.
తులాలు కాదు…గ్రాములు కాదు ఏకంగా కిలోలకు కిలోలే గోల్డ్ను విదేశాల నుంచి అక్రమంగా తరలిస్తున్నారు. చెన్నై ఎయిర్పోర్ట్లో దుబాయ్ నుంచి వస్తున్న ప్యాసింజర్స్ దగ్గర భారీగా బంగారు ఆభరణాలు, విదేశీ కరెన్సీని గుర్తించారు అధికారులు.
మొత్తం 15 మందిని చెక్ చేసిన కస్టమ్స్ అధికారులు కోటి 23లక్షల విలువ చేసే నాలుగు కేజీల బంగారాన్ని సీజ్ చేశారు. చెన్నై నుండి దుబాయ్ కి వెళ్తున్న మరో ప్రయాణికుడి దగ్గర విదేశీ కరెన్సీని గుర్తించారు అధికారులు. పట్టుబడిన ఫారెన్ కరెన్సీ కూడా 12లక్షలు విలువ చేస్తుందని అధికారులంటున్నారు. ముగ్గురిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు.
Tamil Nadu: 2.4 kg of gold worth Rs 1.23 crores & foreign currency worth Rs 12 lakhs seized by Chennai Air Customs; One passener arrested pic.twitter.com/UHWQxfWT5W
— ANI (@ANI) December 14, 2020