సామాన్యుల‌కు అందనంటోన్న బంగారం…ఇవాళ రేట్లు ఇలా…

|

Jun 01, 2020 | 10:53 AM

బంగారం ధర సామాన్యుల‌కు అంద‌నంటూ పైకి తెగ ఉరుకులు పెడుతోంది. బంగారం కొనాల‌నుకునేవారిని బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. ధర వరుసగా రెండో కూడా పెరిగింది. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్‌లో ప‌సిడి ధర పెరుగుదల నేపథ్యంలో.. దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరిగింద‌ని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారంతో పాటే.. వెండి ధర కూడా పైకి ఎగసింది. హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం ప‌సిడి ధర పెరిగింది. 10 గ్రామ్స్ 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ.360 పైకి ఎగసింది. […]

సామాన్యుల‌కు అందనంటోన్న బంగారం...ఇవాళ రేట్లు ఇలా...
Follow us on

బంగారం ధర సామాన్యుల‌కు అంద‌నంటూ పైకి తెగ ఉరుకులు పెడుతోంది. బంగారం కొనాల‌నుకునేవారిని బ్యాడ్ న్యూస్ ఏంటంటే.. ధర వరుసగా రెండో కూడా పెరిగింది. ఇంట‌ర్నేష‌న‌ల్ మార్కెట్‌లో ప‌సిడి ధర పెరుగుదల నేపథ్యంలో.. దేశీ మార్కెట్‌లోనూ బంగారం ధర పెరిగింద‌ని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. బంగారంతో పాటే.. వెండి ధర కూడా పైకి ఎగసింది.

హైదరాబాద్ మార్కెట్‌లో సోమవారం ప‌సిడి ధర పెరిగింది. 10 గ్రామ్స్ 22 క్యారెట్స్ గోల్డ్ ధర రూ.360 పైకి ఎగసింది. దీంతో ధర రూ.45,080కు చేరింది. అదే క్ర‌మంలో 24 క్యారెట్స్ గోల్డ్ ధర కూడా పైకి కదిలింది. 10 గ్రాముల బంగారం ధర రూ.360 పెరిగింది. దీంతో ధర రూ.49,150కు క‌దిలింది. పసిడి ధరతో పాటే వెండి ధ‌ర కూడా పెర‌గం గ‌మ‌నార్హం. కేజీ వెండి ధర ఏకంగా రూ.1550 పెర‌గ‌డం షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. దీంతో ధర రూ.50,100కు చేరింది. నాణేపు తయారీదారులు, పరిశ్రమ యూనిట్ల నుంచి డిమాండ్ రావ‌డ‌మే ఇందుకు మెయిన్ రీజ‌న్ అని చెప్పుకోవచ్చు.

మ‌రోవైపు దేశ రాజధాని ఢిల్లీ మార్కెట్‌లో బంగారం ధర పెరిగింది. 22 క్యారెట్స్ 10 గ్రామ్స్ గోల్డ్ ధర రూ.200 పైకి ఎగ‌సింది. దీంతో ధర రూ.45,700కు చేరింది. అదే క్ర‌మంలో 24 క్యారెట్స్ 10 గ్రాముల బంగారం ధర కూడా పెరిగింది. రూ.200 పెరుగడంతో రూ.47,500కు చేరింది. ఇక కేజీ వెండి ధర రూ.1550 పెరుగుదలతో రూ.50,100కు చేరింది. బంగారం ధరపై ఎఫెక్ట్ చూపే అంశాలు చాలానే ఉన్నాయి. వడ్డీ రేట్లు, జువెలరీ మార్కెట్, ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాణిజ్య యుద్ధాలు భౌగోళిక ఉద్రిక్తతలు, వంటి పలు అంశాలు పసిడి ధరపై ప్రభావం చూపుతాయి.