గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల కౌంటింగ్ హోరాహోరీగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే పలుచోట్ల విచిత్ర ఘనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిచోట్ల తక్కువ ఓట్లు నమోదు కాగా, లెక్కింపులో ఎక్కువ ఓట్లు దర్శనమిస్తున్నాయి. మరికొన్ని చోట్ల ఎక్కువ ఓట్లు నమోదు కాగా, అందులోని ఓట్లు గల్లంతైన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా, మౌలాలి డివిజన్లో కౌంటింగ్ను అధికారులు నిలిపివేశారు. మౌలాలి డివిజన్లో లెక్కింపు ప్రక్రియను అధికారులు నిలిపివేశారు. ఓ బ్యాలెట్ బాక్సులో అధికంగా 33 ఓట్లు ఉన్నాయి. మొత్తం 361 ఓట్లు నమోదు కాగా.. బాక్సులో 394 ఓట్లు ఉన్నాయి. దీంతో అధికారులు కౌంటింగ్ను నిలిపివేశారు. అయినప్పటికీ, ఇప్పటికే వెల్లడైన ఫలితాల్లో అనేక చోట్ల అధికార టీఆర్ఎస్ అత్యధిక ఓట్లతో దూసుకుపోతోంది.