గ్రేటర్ ఎన్నికల్లో పతంగి పార్టీ టార్గెట్ 50.. పక్కా వ్యూహంతోనే గెలుపుపై ధీమా.!

| Edited By: Ram Naramaneni

Dec 01, 2020 | 6:08 AM

గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తాము అనుకున్న సీట్లను గెలుస్తామని ధీమాగా ఉంది. ఎన్నికల్లో పోటీ పడే స్థానాల నుంచి ప్రచార పర్వం వరకు తమదైన వ్యూహాలతో

గ్రేటర్ ఎన్నికల్లో పతంగి పార్టీ టార్గెట్ 50.. పక్కా వ్యూహంతోనే గెలుపుపై ధీమా.!
Follow us on

గ్రేటర్ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ తాము అనుకున్న సీట్లను గెలుస్తామని ధీమాగా ఉంది. ఎన్నికల్లో పోటీ పడే స్థానాల నుంచి ప్రచార పర్వం వరకు తమదైన వ్యూహాలతో ఎంఐఎం నేతలు దూసుకుపోయారు. పరిస్థితులు ఖచ్చితంగా అనుకూలిస్తే పూర్వ వైభవాన్ని దక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఈసారి మజ్లిస్ పార్టీ మొత్తం 51 డివిజన్లలో పోటీ చేస్తుండగా.. అందులో 50 స్థానాలు గెలవాలన్నది టార్గెట్‌గా పెట్టుకుంది. ఇక అన్ని కూడా ఖచ్చితంగా గెలుస్తామన్న స్థానాలనే ఎంపిక చేసుకుంది. పక్కా ప్రణాళికలు సిద్ధం చేసుకుని అభ్యర్థులను నిలబెట్టింది. గతంలో కంటే భిన్నంగా ప్రచారం చేసిన ఎంఐఎం.. అధికార పార్టీకి అనుకూలంగా ఉంటుందన్న ముద్రను ఎక్కడా కూడా రాకుండా చూసుకుంది. టీఆర్ఎస్‌తో ఎలాంటి పొత్తు లేదని ప్రజలకు చెప్పుకొచ్చింది. దానికి తగ్గట్టుగానే ఆ పార్టీ నేతల నుంచి టీఆర్ఎస్‌ వ్యతిరేక వ్యాఖ్యలు వినిపించాయి.