కేజ్రీవాల్‌పై గంభీర్ ఫైర్

| Edited By: Srinu

Mar 07, 2019 | 4:53 PM

భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సీరియస్ అయ్యారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ.. పత్రికల్లో కేజ్రీవాల్ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వడంపై ట్విట్టర్ వేదికగా ఏకిపారేశారు. Today’s newspapers seemed to me a “Mall Of Kejriwal” with @AamAadmiParty advertisements splashed all over. Is this the taxpayer’s money being splurged callously? Can someone from his office or @AamAadmiParty […]

కేజ్రీవాల్‌పై గంభీర్ ఫైర్
Follow us on

భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌పై సీరియస్ అయ్యారు. కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ.. పత్రికల్లో కేజ్రీవాల్ పెద్ద ఎత్తున ప్రకటనలు ఇవ్వడంపై ట్విట్టర్ వేదికగా ఏకిపారేశారు.


సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు ప్రచారా ఆర్భాటాల కోసం చేసే ఖర్చును తగ్గించుకోవాలని గంభీర్ హితపు పలికారు. పత్రికలన్నీ కేజ్రీవాల్ ప్రకటనలతో నిండిపోయి.. కేజ్రీవాల్ మాల్‌ని తలపించాయంటూ ఎద్దేవా చేశారు.

పన్ను చెల్లింపుదారుల సొమ్మును దుర్వినియోగం చేయడం కాదా..? అంటూ కేజ్రీవాల్‌ను ప్రశ్నించారు గంభీర్. ఎన్నికల్లో పోటీ చేసేందుకు కేజ్రీవాల్ దగ్గర డబ్బులు లేవని అనుకున్నామని.. కానీ ఇలా ప్రజల సొమ్మును ఖర్చుచేయడం ఏంటని నిలదీశారు.