శ్రీవారి భక్తులకు టీటీడీ నూతన సంవత్సర కానుక!

| Edited By:

Dec 31, 2019 | 6:45 PM

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన సంవత్సరానికిగాను భక్తులకు తీపికబురు అందించింది. దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్ములించేందుకు శ్రీకారం చుట్టింది టీటీడీ. వైకుంఠ ఏకాదశి నుంచి కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక లడ్డు ఇవ్వబోతోంది. నెలకు 24 లక్షల లడ్డూలు ఉచితంగా పంపిణి చేయాలనీ దేవస్థానం నిర్ణయించింది. ఈ సౌకర్యం ఇంతకుముందు కాలినడకనే వచ్చే భక్తులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఎలాంటి సిఫారసు లేఖలు లేకుండానే భక్తులు అదనంగా లడ్డులు కొనుగోలు […]

శ్రీవారి భక్తులకు టీటీడీ నూతన సంవత్సర కానుక!
Follow us on

తిరుమల తిరుపతి దేవస్థానం నూతన సంవత్సరానికిగాను భక్తులకు తీపికబురు అందించింది. దళారీ వ్యవస్థను పూర్తిగా నిర్ములించేందుకు శ్రీకారం చుట్టింది టీటీడీ. వైకుంఠ ఏకాదశి నుంచి కొత్త విధానాన్ని అమలు చేస్తోంది. శ్రీవారిని దర్శించుకున్న ప్రతి భక్తుడికి ఒక లడ్డు ఇవ్వబోతోంది. నెలకు 24 లక్షల లడ్డూలు ఉచితంగా పంపిణి చేయాలనీ దేవస్థానం నిర్ణయించింది. ఈ సౌకర్యం ఇంతకుముందు కాలినడకనే వచ్చే భక్తులకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఎలాంటి సిఫారసు లేఖలు లేకుండానే భక్తులు అదనంగా లడ్డులు కొనుగోలు చేసుకునే సౌకర్యాన్ని కల్పించింది.