టర్కీలో బస్సు ప్రమాదం.. ఐదుగురు జవాన్లు మృతి..

| Edited By:

Jul 28, 2020 | 8:00 PM

టర్కీలో సోమవారం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రేకులు ఫెయిల్‌ కావడంతో టర్కీష్ జవాన్లతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో 27 మంది తీవ్రంగా..

టర్కీలో బస్సు ప్రమాదం.. ఐదుగురు జవాన్లు మృతి..
Follow us on

టర్కీలో సోమవారం ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. బ్రేకులు ఫెయిల్‌ కావడంతో టర్కీష్ జవాన్లతో వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. మరో 27 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఐదుగురు జవాన్లు కూడా ఉన్నారు. మరో పది మంది జవాన్లకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని టర్కీష్ డిఫెన్స్‌ మినిస్టర్ హులుసీ అకర్ తెలిపారు. టర్కీలోని మెర్సిన్‌ ప్రావిన్స్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సుకు బ్రేకులు ఫెయిల్ అవ్వడంతో డ్రైవర్ బస్సులో ఉన్న వారికి సమాచారం అందించి.. అదుపు చేసేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశాడని.. అయినప్పటికీ ప్రమాదం చోటుచేసుకున్నట్లు అధికారి తెలిపారు.