ఈ నలుగురు అక్కాచెల్లెళ్లు..ఒకేరోజు పెళ్లిపీటలెక్కబోతున్నారు..

|

Dec 15, 2019 | 12:47 PM

మీరు ఇమేజ్‌లో చూస్తున్న ఈ నలుగురు అక్కాచెల్లెళ్లు. వీరంతా ఒకేరోజు పుట్టారు.  కాబట్టి రూపురేఖలు కూడా ఒకేలా ఉంటాయి. ఒకే ఇంట్లో  కలిసి పెరిగారు. అందరూ సేమ్ స్కూల్. నలుగురికి ఒకే డ్రస్ కోడ్. అదేవిధంగా ఆ నలుగురు ఇప్పుడు ఒకేరోజు పెళ్లి చేసుకోబోతున్నారు. అవును ఈ అక్కాచెల్లెళ్లు నలుగురికి వారి జీవిత భాగస్వాములను కుటుంబ పెద్దలు సెలక్ట్ చేశారు. 1995 నవంబర్ 18న జన్మించిన ఈ క్యూట్ సిస్టర్స్..ఏప్రిల్ 26 న గురువాయూర్ లోని శ్రీ […]

ఈ నలుగురు అక్కాచెల్లెళ్లు..ఒకేరోజు పెళ్లిపీటలెక్కబోతున్నారు..
Follow us on

మీరు ఇమేజ్‌లో చూస్తున్న ఈ నలుగురు అక్కాచెల్లెళ్లు. వీరంతా ఒకేరోజు పుట్టారు.  కాబట్టి రూపురేఖలు కూడా ఒకేలా ఉంటాయి. ఒకే ఇంట్లో  కలిసి పెరిగారు. అందరూ సేమ్ స్కూల్. నలుగురికి ఒకే డ్రస్ కోడ్. అదేవిధంగా ఆ నలుగురు ఇప్పుడు ఒకేరోజు పెళ్లి చేసుకోబోతున్నారు. అవును ఈ అక్కాచెల్లెళ్లు నలుగురికి వారి జీవిత భాగస్వాములను కుటుంబ పెద్దలు సెలక్ట్ చేశారు. 1995 నవంబర్ 18న జన్మించిన ఈ క్యూట్ సిస్టర్స్..ఏప్రిల్ 26 న గురువాయూర్ లోని శ్రీ కృష్ణ దేవాలయంలో  వివాహాలు చేసుకోనున్నారు. 2019 సెప్టెంబర్‌లో వీరి ఎంగేజ్‌మెంట్ జరిగింది.

వాస్తవానికి వీరు మొత్తం ఐదుగురు  పిల్లలు ఒకేసారి పుట్టారు. నలుగురు అమ్మాయిలు, ఒక అమ్మాయి. వారి పేర్లు… ఉత్రా, ఉత్రజా, ఉతరా, ఉతమా. అబ్బాయి పేరు ఉత్రాజన్. ఐదు ఒకే కాన్పులో పుట్టడంతో అప్పట్లో న్యూస్‌లో హాట్ టాపిక్ అయ్యారు. ఐదుగురు పిల్లలు తక్కువ బరువుతో పుట్టడంతో వారిని ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. పేరెంట్స్ వారిని జాగ్రత్తగా కాపాడుకుంటూ వస్తుండగా, పిల్లలకు 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు వారి తండ్రి ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో కుటుంబ భారమంతా వారి తల్లి రెమా దేవిపై పడింది. ఆ కుటుంబ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్న ప్రభుత్వం రెమా దేవికి బ్యాంకులో ఉద్యోగాన్ని కల్పించింది. ఆ డబ్బుతో ఆమె బిడ్డలను సాకి పెద్దవాళ్లను చేసింది. ఐదుగురు పిల్లల్ని గ్రాడ్యువేట్స్‌గా మార్చింది. కాగా ప్రస్తుతం నలుగురు బిడ్డలకి వివాహాలు నిశ్చయమవడంతో ఆ తల్లి ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.