Breaking News : మాజీ ముఖ్యమంత్రి కరోనాతో మ‌ృతి.. సంతాపం తెలిపిన ప్రధాని మోదీ

|

Nov 23, 2020 | 7:58 PM

అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌ గొగొయ్‌ కన్ను మూశారు. కోవిడ్‌ అనంతర అనారోగ్య సమస్యలతో ఈ నెల 2న ఆస్పత్రిలో చేరిన గొగొయ్‌ సోమవారం సాయంత్రం మృతి చెందినట్లుగా రాష్ట్రా ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వ శర్..

Breaking News : మాజీ ముఖ్యమంత్రి కరోనాతో మ‌ృతి.. సంతాపం తెలిపిన ప్రధాని మోదీ
Follow us on

Tarun Gogoi Passed Away : అస్సాం మాజీ ముఖ్యమంత్రి తరుణ్‌ గొగొయ్‌ కన్ను మూశారు. కోవిడ్‌ అనంతర అనారోగ్య సమస్యలతో ఈ నెల 2న ఆస్పత్రిలో చేరిన గొగొయ్‌ సోమవారం సాయంత్రం మృతి చెందినట్లుగా రాష్ట్రా ఆరోగ్య శాఖ మంత్రి హిమంత బిస్వ శర్ వెల్లడించారు. గొగోయ్‌ శరీరంలో పలు అవయవాల పనితీరు క్షీణించడంతో వెంటిలేటర్‌ సపోర్టుపై ఉన్న సంగతి తెలిసిందే.

ఈ ఏడాది ఆగస్టులో గొగోయ్‌ కరోనా బారిన పడ్డారు. దాంతో ఆయనను ఆస్పత్రిలో చేర్పించారు. ఆరోగ్యం మరింత క్షీణించడంతో ప్లాస్మా థెరిపీ కూడా అందించారు. ఆ తర్వాత కోవిడ్ నుంచి కోలుకున్నారు అనుకునేంతలో ఆయన మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు.