ఈ-కామర్స్ దిగ్గజ సంస్థ ఫ్లిప్కార్ట్ ఈ నెల 15 నుంచి 19 వరకు ఐదు రోజులపాటు బిగ్ షాపింగ్ డేస్ సేల్ను నిర్వహించనున్నట్టు తెలిపింది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాప్లు ఇతర గాడ్జెట్లపై భారీ రాయితీలు ప్రకటించేందుకు రెడీ అవుతోంది. వీటితోపాటు గృహోపకరణాలు, లార్జ్ అప్లయెన్సెస్, ఫ్యాషన్ ఉత్పత్తులు, గార్మెంట్లు వంటి వాటిపైనా ఆఫర్ల వర్షం కురిపించనుంది. సేల్లో భాగంగా హెచ్డీఎఫ్సీ బ్యాంక్తో ఒప్పందం కుదుర్చుకుంది. ఫలితంగా ఈ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేసే వారికి తక్షణ క్యాష్బ్యాక్ ఆఫర్లు ఇవ్వనుంది. ఈ సేల్కు సంబంధించి మరిన్ని వివరాలను ఫ్లిప్కార్ట్ శుక్రవారం ప్రకటించనుంది.