తూర్పుగోదావరి జిల్లాలో ఓ పూరిల్లు అగ్నికి ఆహుతైంది. తుని పట్టణ శివారు ఉప్పరిగూడెంలో తెల్లవారుజామున ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఉన్నఫళంగా ఇల్లు దగ్థం కావడంతో ప్రాణాలు అరచేత పట్టుకుని ఇంటిలోని వాళ్లంతా కట్టు బట్టలతో బయటపడ్డారు. ప్రమాదానికి కారణాలను అన్వేషిస్తోన్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.