ఓ మహిళ కోసం ఇద్దరి మధ్య ఘర్షణ.. ఓ యువకుడు మృతి

|

Aug 26, 2020 | 5:13 PM

హైదరాబాద్‌ లో దారుణం జరిగింది. ఓ మహిళ కోసం ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హైదరాబాద్ మహానగర్ నడిబొడ్డులోని ప్రముఖ మిఠాయి దుకాణంలో ఈ దారుణం చోటుచేసుకుంది.

ఓ మహిళ కోసం ఇద్దరి మధ్య ఘర్షణ.. ఓ యువకుడు మృతి
Follow us on

హైదరాబాద్‌ లో దారుణం జరిగింది. ఓ మహిళ కోసం ఇద్దరు యువకుల మధ్య జరిగిన ఘర్షణలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన హైదరాబాద్ మహానగర్ నడిబొడ్డులోని ప్రముఖ మిఠాయి దుకాణంలో ఈ దారుణం చోటుచేసుకుంది. శివారెడ్డి స్వీట్ హౌప్‌లో పనిచేస్తున్న ఇద్దరు సిబ్బంది ఒకరినొకరు పిడిగుద్దులతో దాడి చేసుకోగా తీవ్ర గాయాలతో ఓ వర్కర్‌ మృతి చెందాడు.

మదురానగర్‌లోని శివారెడ్డి స్వీట్‌ షాప్‌లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన శ్రీనివాస్‌, గౌస్‌ అనే ఇద్దరు యువకులు పనిచేస్తన్నారు. భద్రాద్రి జిల్లాకు చెందిన మహిళతో శ్రీనివాస్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నట్లు అనుమానించిన గౌస్ నిలదీశాడు. ఆ మహిళ సమక్షంలోనే ఇద్దరి మద్య గొడవ మొదలైంది. దీంతో కోపోద్రిక్తుడైన గౌస్‌.. ఒక్కసారిగా శ్రీనివాస్ మొహం తలపై పిడిగుద్దులతో విరుచుకుపడ్డాడు. దీంతో తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. మృతుడు శ్రీనివాస్ స్వస్థలం కొత్త గూడెం జిల్లా రామవరం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనస్థలానికి చేరుకుని గౌస్ ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన ఎస్సార్‌ నగర్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.