వైసీపీలో వార్: శ్రీచైతన్యకి, కోటంరెడ్డికి లింకేంటి..?

| Edited By: Anil kumar poka

Oct 09, 2019 | 11:13 AM

వైసీపీలో వార్ షురూ అయ్యిందా..? ఆ ఇద్దరి నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా..? అంటే.. అవుననే అనిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో ఇద్దరి నేతల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోందా..? అక్కడ జరిగిన ఘటనను చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ఇటీవలే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఎంపీడీవో సరళ మీద దాడి చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో.. ఆయనపై కేసు కూడా నమోదయ్యింది. ఈ క్రమంలో ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అరెస్ట్ […]

వైసీపీలో వార్: శ్రీచైతన్యకి, కోటంరెడ్డికి లింకేంటి..?
Follow us on

వైసీపీలో వార్ షురూ అయ్యిందా..? ఆ ఇద్దరి నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుందా..? అంటే.. అవుననే అనిపిస్తోంది. నెల్లూరు జిల్లాలో ఇద్దరి నేతల మధ్య ఆధిపత్యపోరు నడుస్తోందా..? అక్కడ జరిగిన ఘటనను చూస్తుంటే అలాగే కనిపిస్తోంది. ఇటీవలే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. ఎంపీడీవో సరళ మీద దాడి చేశారంటూ ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో.. ఆయనపై కేసు కూడా నమోదయ్యింది. ఈ క్రమంలో ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అరెస్ట్ వెనుక నారాయణ, శ్రీచైతన్య విద్యాసంస్థలతో పాటు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్థన్ రెడ్డి అనుచరుల హస్తం కూడా ఉందని ఆరోపించారు. దీంతో.. నెల్లూరులో కాకాణి గోవర్థన్ రెడ్డి వర్సెస్ కోటంరెడ్డిగా మారింది.

ఎంపీడీవో సరళ తనపై అసత్య ఆరోపణలు చేశారని.. ఇంటిపై దాడి చేశారని చెబుతోన్న ఎంపీడీవో.. నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లకుండా ఎమ్మెల్యే కాకాణి ఇంటికెళ్లారని ఆయన ఆరోపించారు. జిల్లా ఎస్పీతో తనకు వ్యక్తిగత విభేదాలున్నాయని.. దీనిపై నాలుగు రోజుల క్రితం కలెక్టర్‌కు ఫిర్యాదు చేశానని.. ఆధారాలు ఉంటే చర్యలు తీసుకోమని సీఎం చెబితే.. ఎస్పీ వ్యక్తిగత కక్ష తీర్చుకునే ప్రయత్నం చేశారన్నారు. అర్థరాత్రి తమ ఇళ్లపై దాడులు చేసి ఇబ్బంది పెట్టారని ఆరోపించారు.

అలాగే.. కోటంరెడ్డి బంధువు కృష్ణారెడ్డి వెంకటాచలం మండలంలో.. ఓ రియల్‌ ఎస్టెట్ విషయంలో కూడా తగాదా లేచింది. ఆ రియల్ ఎస్టేట్‌కి.. వాటర్ కనెక్షన్ ఇవ్వాల్సిందిగా గత కొన్ని రోజులుగా కోరుతున్నారు. దానికి ఎంపీడీవో ఫోన్ చేసి విషయం అడిగితే.. మా ఎమ్మెల్యే కాకాణి ఇవ్వొద్దన్నారు అని చెప్పారని కోటంరెడ్డి స్వయంగా వెల్లడించారు. ఇదే విషయంలో కోటం రెడ్డి.. కాకాణీకి ఫోన్ చేసినా.. నువ్వు ఊరుకో అని చెప్పారని మీడియాకు వెల్లడించారు.

నెల్లూరులో వైసీపీ పార్టీ క్లీన్‌స్వీప్ చేసింది. అసెంబ్లీ స్థానంలోనూ విజయం సాధించింది. అనిల్ కుమార్ యాదవ్ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే.. జిల్లాలో పట్టుకోసం మాత్రం ఆ నేతల్లో వాళ్లల్లో వారికే ఆధిపత్య పోరు నడుస్తోంది. ఎవరికి వారు తమ హవా నడిపించాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే.. కోటం రెడ్డి, కాకాణి మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో.. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.. కాకాణి ఒత్తిడి వల్లే తన మీద వ్యక్తిగతంగా కక్ష తీర్చుకుంటున్నారని మీడియా ముందు బహిరంగంగా తన అక్కసును వెల్లగక్కుతున్నారు.