ద్రాక్ష పళ్ల నుంచి మద్యం తయారీ.. తండ్రీ కొడుకుల అరెస్టు..!

| Edited By:

May 04, 2020 | 8:01 PM

కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ విధించాయి. ఈ క్రమంలో ద్రాక్ష పళ్లు, బియ్యం నుంచి మద్యం తయారుచేస్తున్న తండ్రీ కొడుకులను చైన్నై పోలీసులు అరెస్టు చేశారు. వారితో

ద్రాక్ష పళ్ల నుంచి మద్యం తయారీ.. తండ్రీ కొడుకుల అరెస్టు..!
Follow us on

Wine at home: కోవిద్-19 ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఈ వైరస్ ధాటికి ప్రపంచ దేశాలన్నీ లాక్‌డౌన్ విధించాయి. ఈ క్రమంలో ద్రాక్ష పళ్లు, బియ్యం నుంచి మద్యం తయారుచేస్తున్న తండ్రీ కొడుకులను చైన్నై పోలీసులు అరెస్టు చేశారు. వారితో పాటూ ఉన్న మరో వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ద్రాక్ష నుంచి తయారు చేసిన 30 లీటర్ల మద్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వివరాల్లోకెళితే.. చైన్నైలోకి కొండగయూర్ ప్రాంతంలో అక్రమంగా మద్యం తయారువుతోందని తెలుసుకుని పోలీసులు అక్కడున్న ఓ ఇంటిని తనిఖీ చేశారు. ఆ సందర్భంగా తండ్రీ కొడుకుల నిర్వాకం బయటపడింది. ఇంటి పరిసరాలను జల్లెడ పట్టగా దాక్ష నుంచి తయారు చేసిన 30 లీటర్ల మద్యం వారికి కనిపించింది. దానితో పాటూ బియ్యం నుంచి తాయరు చేస్తున్నది కూడా తనిఖీల్లో వెల్లడైంది. వీటన్నిటినీ సీజ్ చేసిన పోలీసులు.. చట్టాన్ని ఉల్లంఘించిన ముగ్గురు నిందితులను పోలీస్ స్టేషన్‌కు తరలించారు.