మమ్మల్ని అంతం చేయడానికి, ట్రాక్టర్ ర్యాలీ ఆపడానికి కుట్ర, రైతు సంఘాల నేతల ఆరోపణ, పోలీసులకు ఒకరి అప్పగింత,

| Edited By: Anil kumar poka

Jan 23, 2021 | 6:07 PM

రైతుల ఆందోళనలో కొత్త మలుపు ! తమను అంతం చేయడానికి, ఈ నెల 26 న తమ ట్రాక్టర్ ర్యాలీని భంగ పరచేందుకు కుట్ర జరుగుతోందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు.

మమ్మల్ని అంతం చేయడానికి, ట్రాక్టర్ ర్యాలీ ఆపడానికి  కుట్ర, రైతు సంఘాల నేతల ఆరోపణ,  పోలీసులకు ఒకరి అప్పగింత,
Follow us on

రైతుల ఆందోళనలో కొత్త మలుపు ! తమను అంతం చేయడానికి, ఈ నెల 26 న తమ ట్రాక్టర్ ర్యాలీని భంగ పరచేందుకు కుట్ర జరుగుతోందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. సింఘు బోర్డర్ లో మీడియాతో మాట్లాడిన వారు.. తాము ఓ వ్యక్తిని పట్టుకున్నామని, నలుగురు రైతు నేతలపై కాల్పులు జరపాలని, ట్రాక్టర్ ర్యాలీని అడ్డుకోవాలని కొందరు తనను ఆదేశించినట్టు ఆ వ్యక్తి తెలిపాడని వెల్లడించారు. ముఖానికి స్కార్ఫ్ ధరించి ఉన్న ఇతడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. తనతో బాటు ఇద్దరు మహిళలతో సహా 9 మంది కూడా ఈ కుట్రలో భాగస్వాములుగా ఉన్నారని ఈ వ్యక్తి చెప్పినట్టు వారు పేర్కొన్నారు. సుమారు 21 ఏళ్ళ ఈ వ్యక్తిని రైతులు హర్యానా పోలీసులకు అప్పగించారు. సోనేపట్ ఖాకీలు ఇతడిని విచారిస్తున్నారు. కాగా కొంతమంది పోలీసు అధికారుల పేర్లను కూడా ఈ యువకుడు వెల్లడించాడు. కానీ వారి గురించి రైతులు తెలుసుకోగా-తమకు ఈ యువకునికి అసలు సంబంధమే లేదని వారు చెప్పినట్టు తెలుస్తోంది.


Read More:రైతుల ఆందోళనలో పురోగతి, రెండ్రోజులు మందుగానే దిగొచ్చిన కేంద్రం.. మంగళవారం చర్చలు అసంపూర్ణం.
Read Also :ఆందోళనలో మహారాష్ట్ర రైతులు కూడా ! నాసిక్ నుంచి ఢిల్లీకి ప్రయాణం, చట్టాల రద్దుకై హర్యానాలో అన్నదాతల హోమం,