రైతుల ఆందోళనలో కొత్త మలుపు ! తమను అంతం చేయడానికి, ఈ నెల 26 న తమ ట్రాక్టర్ ర్యాలీని భంగ పరచేందుకు కుట్ర జరుగుతోందని రైతు సంఘాల నేతలు ఆరోపించారు. సింఘు బోర్డర్ లో మీడియాతో మాట్లాడిన వారు.. తాము ఓ వ్యక్తిని పట్టుకున్నామని, నలుగురు రైతు నేతలపై కాల్పులు జరపాలని, ట్రాక్టర్ ర్యాలీని అడ్డుకోవాలని కొందరు తనను ఆదేశించినట్టు ఆ వ్యక్తి తెలిపాడని వెల్లడించారు. ముఖానికి స్కార్ఫ్ ధరించి ఉన్న ఇతడిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. తనతో బాటు ఇద్దరు మహిళలతో సహా 9 మంది కూడా ఈ కుట్రలో భాగస్వాములుగా ఉన్నారని ఈ వ్యక్తి చెప్పినట్టు వారు పేర్కొన్నారు. సుమారు 21 ఏళ్ళ ఈ వ్యక్తిని రైతులు హర్యానా పోలీసులకు అప్పగించారు. సోనేపట్ ఖాకీలు ఇతడిని విచారిస్తున్నారు. కాగా కొంతమంది పోలీసు అధికారుల పేర్లను కూడా ఈ యువకుడు వెల్లడించాడు. కానీ వారి గురించి రైతులు తెలుసుకోగా-తమకు ఈ యువకునికి అసలు సంబంధమే లేదని వారు చెప్పినట్టు తెలుస్తోంది.
#WATCH | Delhi: Farmers at Singhu border present a person who alleges a plot to shoot four farmer leaders and cause disruption; says there were plans to cause disruption during farmers’ tractor march on Jan 26. pic.twitter.com/FJzikKw2Va
— ANI (@ANI) January 22, 2021
Read More:రైతుల ఆందోళనలో పురోగతి, రెండ్రోజులు మందుగానే దిగొచ్చిన కేంద్రం.. మంగళవారం చర్చలు అసంపూర్ణం.
Read Also :ఆందోళనలో మహారాష్ట్ర రైతులు కూడా ! నాసిక్ నుంచి ఢిల్లీకి ప్రయాణం, చట్టాల రద్దుకై హర్యానాలో అన్నదాతల హోమం,