బాబు, బాలయ్య, కేశవ్ మినహా సీమలో జగన్ పాగా

|

May 24, 2019 | 4:48 PM

రాయలసీమలో వైసీపీ ప్రభజనం సృష్టించింది. ముందుగా అధినేత జగన్ సొంత జిల్లా కడపలోొ పార్టీ  క్లీన్ స్వీప్ చేసింది. పులివెందుల నుంచి పార్టీ అధినేత జగన్ 90,543 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. 2014 లోనే జగన్ వైపు నిలిచిన కర్నూల్ జిల్లా ఈ సారి ఆ బలాన్ని మరింత పెంచుకొని క్లీన్ స్వీప్ చేసేసింది. ఇక చిత్తూరులో మొత్తం 14 స్థానాలు ఉండగా 13 సీట్లను వైసీపీ కొల్లగొట్టింది. చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో […]

బాబు, బాలయ్య, కేశవ్ మినహా సీమలో జగన్ పాగా
Follow us on

రాయలసీమలో వైసీపీ ప్రభజనం సృష్టించింది. ముందుగా అధినేత జగన్ సొంత జిల్లా కడపలోొ పార్టీ  క్లీన్ స్వీప్ చేసింది. పులివెందుల నుంచి పార్టీ అధినేత జగన్ 90,543 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. 2014 లోనే జగన్ వైపు నిలిచిన కర్నూల్ జిల్లా ఈ సారి ఆ బలాన్ని మరింత పెంచుకొని క్లీన్ స్వీప్ చేసేసింది. ఇక చిత్తూరులో మొత్తం 14 స్థానాలు ఉండగా 13 సీట్లను వైసీపీ కొల్లగొట్టింది. చంద్రబాబు సొంత జిల్లా అయిన చిత్తూరులో ఆయన ఒక్కరు మాత్రమే గెలవగలిగారు. ఇక అనంతపురంలో హిందూపూర్, ఉరవకొండ స్థానాలను టీడీపీ గెలుచుకుంది. తమ పార్టీకి సాంప్రదాయంగా వస్తున్న హిందూపూర్ స్థానంలో బాలయ్య మరోసారి సత్తా చాటగా..ఉరవకొండలో పయ్యావుల కేశవ్ ఉత్కంఠ పోరులో స్వల్ప మెజార్టీతో విజయం సాధించారు. ఇక రాజకీయ ప్రాభవం కలిగిన కోట్ల, కేఈ కుటుంబాలు తమ ప్రాభవాన్ని కొల్పోయాయి. ఏది ఏమైనా సీమలో జగన్ సింహనాదం చేశారు.