తెలంగాణ రాష్ట్ర సమితి కార్య నిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ను మహిళా కమిషన్ సభ్యురాలు గద్దల పద్మ హైదరాబాద్లో మర్యాద పూర్వకంగా కలిశారు. కాగా ఉమ్మడి వరంగల్ జిల్లా పరిషత్ చైర్పర్సన్గా అవకాశం కల్పించడం, పదవీ కాలం ముగిసిన తర్వాత కీలకమైన మహిళా కమిషన్లో సభ్యురాలిగా నియమించడంపై గద్దల పద్మ ఈ సందర్భంగా మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. దళిత మహిళగా తనకు కమిషన్లో అరుదైన గౌరవం కల్పించిన సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటానని పద్మ అన్నారు. అనంతరం ఎమ్మెల్సీ కవితను సైతం పద్మ కలిశారు.