11 ఏళ్ల బాలుడిపై గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా.. బాలుడు దుర్మరణం

| Edited By: Balu

Aug 25, 2020 | 11:22 AM

హైదరాబాద్ మహానగరలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపక్కన నిల్చున్న 11 ఏళ్ల బాలుడిపై గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తాపడి దుర్మరణం పాలయ్యాడు. నాచారం పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

11 ఏళ్ల బాలుడిపై గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తా.. బాలుడు దుర్మరణం
Follow us on

హైదరాబాద్ మహానగరలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. రోడ్డుపక్కన నిల్చున్న 11 ఏళ్ల బాలుడిపై గ్యాస్ సిలిండర్ల లారీ బోల్తాపడి దుర్మరణం పాలయ్యాడు. నాచారం పోలీసు స్టేషన్ పరిధిలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చర్లపల్లి నుంచి వస్తున్న భారత్ గ్యాస్ సిలిండర్ లోడ్ లారీ బోల్తా పడింది. చర్లపల్లి నుంచి మల్లాపూర్ వైపు వస్తున్న లారీ ఎఫ్‌సీఐ రోడ్‌లో పక్కసారిగా ప్రమాదానికి గురైంది. మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో గ్యాస్ లారీ బోల్తా పడింది. దీంతో లారీ రోడ్ పక్కనే ఉన్న మహేందర్(11) అనే బాలుడిపై పడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ప్రమాదంలో డ్రైవర్ కృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కళ్ల ముందే బాలుడు మృతి చెందడం పట్ల తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు.