దుబ్బాక: 12 రౌండ్ల లెక్కింపు పూర్తి, 4.030 ఓట్లతో బీజేపీ ముందంజ

| Edited By: Pardhasaradhi Peri

Nov 10, 2020 | 2:43 PM

సిద్దిపేటజిల్లా దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది . ఇప్పటి వరకు 12 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు 4,030 ఓట్లతతో మొదటి స్థానం, తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత రెండో స్థానం, కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇంకా 11 రౌండ్ల ఓట్లు లెక్కించాల్సి ఉంది. 11వ రౌండ్‌లో భాజపాకు 199 ఓట్ల ఆధిక్యం లభించింది. 11వ రౌండ్లు ముగిసే సరికి భాజపాకు 34,748, తెరాసకు […]

దుబ్బాక: 12 రౌండ్ల లెక్కింపు పూర్తి, 4.030 ఓట్లతో బీజేపీ ముందంజ
Follow us on

సిద్దిపేటజిల్లా దుబ్బాక ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది . ఇప్పటి వరకు 12 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యే సరికి భాజపా అభ్యర్థి రఘునందన్‌రావు 4,030 ఓట్లతతో మొదటి స్థానం, తెరాస అభ్యర్థి సోలిపేట సుజాత రెండో స్థానం, కాంగ్రెస్‌ అభ్యర్థి చెరుకు శ్రీనివాస్‌రెడ్డి మూడో స్థానంలో కొనసాగుతున్నారు. ఇంకా 11 రౌండ్ల ఓట్లు లెక్కించాల్సి ఉంది. 11వ రౌండ్‌లో భాజపాకు 199 ఓట్ల ఆధిక్యం లభించింది. 11వ రౌండ్లు ముగిసే సరికి భాజపాకు 34,748, తెరాసకు 30,815, కాంగ్రెస్‌కు 8,582 ఓట్లు లభించాయి.

రౌండ్ల వారీగా పోలైన ఓట్ల వివరాలు.. ఇలా ఉన్నాయి.

మొదటి రౌండ్‌లో 7,446 ఓట్లు లెక్కించగా.. తెరాస 2867, భాజపా 3208, కాంగ్రెస్‌ 648 ఓట్లు సాధించాయి. భాజపా ఆధిక్యం 341 ఓట్లు.

రెండో రౌండ్‌లో: 7,127 ఓట్లు లెక్కించగా.. 794 ఓట్లతో రఘునందన్‌రావు ఆధిక్యం ప్రదర్శించారు. భాజపాకు 3,284 ఓట్లు రాగా, తెరాసకు 2,490, కాంగ్రెస్‌కు 667 ఓట్లు పోలయ్యాయి.

మూడో రౌండ్‌లో: 6,601 ఓట్లు లెక్కించగా… భాజపా 2,731, తెరాసకు 2,607, కాంగ్రెస్‌కు 616 ఓట్లు పోలయ్యాయి. భాజపా ఆధిక్యం 124 ఓట్లు.

నాలుగో రౌండ్‌: భాజపాకు 3,832, తెరాస 2,407, కాంగ్రెస్‌కు 227 ఓట్లు పోలయ్యాయి.

ఐదో రౌండ్‌: భాజపా 3,462, తెరాస 3,126, కాంగ్రెస్‌కు 566 ఓట్లు పోలయ్యాయి.

ఆరో రౌండ్‌లో: తెరాస 4,062, భాజపా 3,709, కాంగ్రెస్‌ 530 ఓట్లు పోలయ్యాయి. తెరాస ఆధిక్యం 353 ఓట్లు.

ఏడో రౌండ్‌లో : మిర్‌దొడ్డి మండలంలో ఓట్లు లెక్కించగా..తెరాసకు 2,718, భాజపాకు 2,536, కాంగ్రెస్‌కు 749 ఓట్లు పోలయ్యాయి. తెరాసకు 182 ఓట్ల ఆధిక్యం.

ఎనిమిదో రౌండ్‌లో: భాజపా 3,116, తెరాస 2,495, కాంగ్రెస్‌కు 1,122 ఓట్లు లభించాయి.

తొమ్మిదో రౌండ్‌లో : భాజపాకు 29,291 ఓట్లు, తెరాసకు 25,101 ఓట్లు, కాంగ్రెస్‌కు 5,800 ఓట్లు పోలయ్యాయి.