మత్తువదలరా.. ‘న్యూఇయరే’ వాళ్ల టార్గెట్‌!

| Edited By:

Dec 16, 2019 | 2:16 PM

డ్రగ్స్.. మత్తులో ముంచేసి ఆఖరికి ప్రాణాల మీదకు తీసుకొచ్చే ఓ మాదకద్రవ్యం. వీటిపై యూత్‌కి ఎంతలా అవగాహన పెంచినా చాపకింద నీరులా ఇది విస్తరిస్తూనే ఉంది. ముఖ్యంగా.. యువతే టార్గెట్‌గా డ్రగ్స్ దందా నడుస్తోంది. ఇప్పుడు వీటి టాపిక్ ఎందుకొచ్చిందంటే.. హైదరాబాద్‌లో ఈ న్యూఇయర్ సెలబ్రేషన్సే టార్గెట్‌గా డ్రగ్స్ మాఫియా రంగంలోకి దిగిందట. ఏకంగా కోట్లలో వీటిపై దందా నడుస్తుంది. ఆఖరికి కొన్నేళ్లక్రితం.. డ్రగ్‌స్టర్స్ ఉల్లిపాయ, ఎండుమిర్చీల్లో కూడా డ్రగ్స్‌ని తరలించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు.. రకరకాల […]

మత్తువదలరా.. న్యూఇయరే వాళ్ల టార్గెట్‌!
Follow us on

డ్రగ్స్.. మత్తులో ముంచేసి ఆఖరికి ప్రాణాల మీదకు తీసుకొచ్చే ఓ మాదకద్రవ్యం. వీటిపై యూత్‌కి ఎంతలా అవగాహన పెంచినా చాపకింద నీరులా ఇది విస్తరిస్తూనే ఉంది. ముఖ్యంగా.. యువతే టార్గెట్‌గా డ్రగ్స్ దందా నడుస్తోంది. ఇప్పుడు వీటి టాపిక్ ఎందుకొచ్చిందంటే.. హైదరాబాద్‌లో ఈ న్యూఇయర్ సెలబ్రేషన్సే టార్గెట్‌గా డ్రగ్స్ మాఫియా రంగంలోకి దిగిందట.

ఏకంగా కోట్లలో వీటిపై దందా నడుస్తుంది. ఆఖరికి కొన్నేళ్లక్రితం.. డ్రగ్‌స్టర్స్ ఉల్లిపాయ, ఎండుమిర్చీల్లో కూడా డ్రగ్స్‌ని తరలించిన విషయం తెలిసిందే. ఒకప్పుడు.. రకరకాల పరికరాల్లో వీటిని అమర్చి దందా చేసేవారు. కానీ.. ఇప్పుడు మానవ దేహాలనే.. డ్రగ్ కంటైనర్లుగా వాడుకుంటోంది డ్రగ్ మాఫియా. ఎల్‌ఎస్‌డీ తదితర మత్తు మందులను పౌడర్, ట్యాబ్లెట్ల రూపంలో నింపి, వాటిని డ్రగ్ రవాణాకు అంగీకరించిన ఓ మనిషి శరీరంలో, రహస్య అవయవాల్లో దాచి.. స్కానర్లకు అందని రీతిలో సరఫరా చేస్తున్నారు. ఇప్పటికే వీటిని ఎంత చాకచక్యంగా చేతులు మార్చి రవాణా చేస్తారో.. వీటిపై ఎంత పెట్టుబడి ఉంటుందో తెలిసే ఉంటుంది.

ఇందులో ముఖ్యంగా నైజీరియన్లు చాలా చాకచక్యంగా, పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. ఎల్‌ఎస్‌డీ లాంటి ప్రమాదకరమైన వాటిని నైజీరియన్ల ముఠా సరఫరా చేస్తుంటుంది. ఇదివరకే చాలా సార్లు పోలీసులకు వారు పట్టుబడ్డారు కూడా. ఈ సారి 2020 న్యూ ఇయర్‌ వేడుకలను టార్గెట్‌ చేసి హైదరాబాద్‌కు డ్రగ్స్‌ తరలిస్తోంది మాఫియా. మరో 15 రోజుల్లో 2020 న్యూయర్ వేడుక రానుంది. దీంతో.. ఆ ఫెస్టివల్‌ను టార్గెట్ చేస్తూ.. పెద్ద మొత్తంలో డ్రగ్స్ చేతులు మారనుందని సమాచారం. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి వచ్చిన సమాచారం నేపథ్యంలో.. ఇప్పటికే పోలీసులు తనిఖీలు కూడా షురూ చేశారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టుల్లో, రైల్వే స్టేషన్లలో, బస్‌ స్టేషన్‌లలో రెక్కీ నిర్వహిస్తున్నారు. అనుమానాస్పందంగా వ్యవహరించిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే.. ఇటీవలే జరిగిన ‘దిశ’ ఘటన నేపథ్యంలో పోలీసులు ఈ సారి న్యూయర్ వేడుకలపై ఆంక్షలు విధించనున్నారని సమాచారం.

కాగా.. సూర్య నటించిన ‘వీడొక్కడే’ మూవీలో అయితే.. డ్రగ్స్‌ని కడుపులోకి మింగి తరలించడం.. దొరికిపోవడంతో ప్రాణాలు పోగొట్టుకోవడం వంటి సీన్స్ మీకు గుర్తుండే ఉంటాయి. రహస్యంగా డ్రగ్స్ రవాణాలో పేరుమోసిన ఘనాపాటీలు కూడా ఇన్వాల్వ్ కావడంతో పోలీసులకు ఇది పెద్ద సవాలుగా మారుతోంది.