లోయలో మంచు వర్షం.. తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు!

| Edited By:

Dec 13, 2019 | 12:31 AM

జమ్మూ కాశ్మీర్‌లోని ద్రాస్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ 15.3 డిగ్రీల సెల్సియస్ వద్ద నమోదయ్యాయి. దీంతో ఉత్తర భారతదేశంలో రానున్న రోజుల్లో భారీ హిమపాతం మరియు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశ రాజధాని ఢిల్లీలో 7.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. గురువారం, శుక్రవారం దేశ రాజధానిలో తేలికపాటి వర్షం, అధిక వేగం గల గాలులు వీస్తాయని, ఇది కాలుష్యం నుండి ఉపశమనం కలిగిస్తుందని అధికారులు తెలిపారు. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, రాజస్థాన్లలో […]

లోయలో మంచు వర్షం.. తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు!
Follow us on

జమ్మూ కాశ్మీర్‌లోని ద్రాస్‌లో ఉష్ణోగ్రతలు మైనస్ 15.3 డిగ్రీల సెల్సియస్ వద్ద నమోదయ్యాయి. దీంతో ఉత్తర భారతదేశంలో రానున్న రోజుల్లో భారీ హిమపాతం మరియు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. దేశ రాజధాని ఢిల్లీలో 7.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదయ్యింది. గురువారం, శుక్రవారం దేశ రాజధానిలో తేలికపాటి వర్షం, అధిక వేగం గల గాలులు వీస్తాయని, ఇది కాలుష్యం నుండి ఉపశమనం కలిగిస్తుందని అధికారులు తెలిపారు. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, రాజస్థాన్లలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఢిల్లీ శివారు ప్రాంతాల్లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఘజియాబాద్ (441), నోయిడా (426), గ్రేటర్ నోయిడా (449), ఫరీదాబాద్ (390), గుర్గావ్ (370) నమోదయ్యాయి. జమ్మూ కాశ్మీర్, లడఖ్ ప్రాంతాలలో బుధవారం తేలికపాటి హిమపాతం నమోదైంది, ఈ ప్రాంతంలో దట్టమైన మేఘాలు ఆవరించి ఉన్నాయి. ఈ కారణంగా రాత్రి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. వాతావరణ శాఖ గురువారం, శుక్రవారం కేంద్రపాలిత ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.