Subhash Goud | Edited By: Ravi Kiran
Nov 03, 2021 | 6:37 AM
Diwali Offers: దీపావళి పండగ సీజన్లో పలు సంస్థలు ఆఫర్లు ప్రకటించాయి. ఈ పండగ సందర్భంగా బిగ్ సీ కూడా కస్టమర్ల కోసం పలు ఆఫర్లు ప్రకటించింది. కస్టమర్లను ఆకట్టుకునేందుకు స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ ప్రకటించింది.
స్మార్ట్ఫోన్ కొనుగోలుపై 10 శాతం క్యాష్బ్యాక్ ప్రకటించింది. అంతేకాకుండా ఎలాంటి వడ్డీ, డౌన్పేమెంట్ లేకుండా ఈఎంఐ పద్దతుల్లో ఫోన్, ఇతర వస్తువులు కొనుగోలు చేయవచ్చని బిగ్ సి తెలిపింది.
పండగ సందర్భంగా ఫోన్ కొనుగోలుపై బజాజ్ ఫైనాన్స్ నుంచి రూ.3,500 వరకు, ఐసీఐసీఐ బ్యాంక్ నుంచి రూ.1,500 వరకు, అమెజాన్ పే నుంచి రూ.3,500 వరకు క్యాష్బ్యాక్ ఆఫర్స్ ఉన్నట్లు తెలిపింది.
అలాగే వివిధ రకాల స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపింది. ఐఫోన్పై రూ.6 వేల వరకు క్యాష్బ్యాక్ పొందే సదుపాయం ఉంది. ఇక సామ్సంగ్ ఫోన్లపై రూ.10 వేల వరకు డిస్కౌంట్ సదుపాయం ఉన్నట్లు బిగ్ సీ తెలిపింది.