కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్!

| Edited By:

Oct 09, 2019 | 4:58 PM

దీపావళి సందర్బంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కానుక అందించింది. డీఏ 5శాతం పెంపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందని సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ బుధవారం  మీడియాకు వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ఉద్యోగులకు చెల్లించే కరవు భత్యం 12 శాతంనుంచి 17శాతానికి పెరిగింది. తాజా పెంపుతో  కేంద్ర ప్రభుత్వానికి 16వేల కోట్ల రూపాయల భారం పడనుందని కేంద్రమంత్రి వెల్లడించారు. పెంచిన డీఏను ఈ ఏడాది జూలై నుంచి అమలు చేయనున్నారు.  దీంతో 50 […]

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్!
Follow us on

దీపావళి సందర్బంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నరేంద్ర మోదీ ప్రభుత్వం కానుక అందించింది. డీఏ 5శాతం పెంపునకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపిందని సమాచార, ప్రసారశాఖ మంత్రి ప్రకాష్‌ జవదేకర్‌ బుధవారం  మీడియాకు వెల్లడించారు. దీంతో ప్రస్తుతం ఉద్యోగులకు చెల్లించే కరవు భత్యం 12 శాతంనుంచి 17శాతానికి పెరిగింది. తాజా పెంపుతో  కేంద్ర ప్రభుత్వానికి 16వేల కోట్ల రూపాయల భారం పడనుందని కేంద్రమంత్రి వెల్లడించారు. పెంచిన డీఏను ఈ ఏడాది జూలై నుంచి అమలు చేయనున్నారు.  దీంతో 50 లక్షలమంది ఉద్యోగులకు, 62 లక్షలమంది పెన్షనర్లకు ప్రయోజనం కలగనుంది.  అంతేకాదు ఆశా వర్కర్లకు  కేంద్రం అందించే భత్యాన్ని రెట్టింపు చేస్తున్నట్టు కేంద్రమంత్రి జవదేకర్ ప్రకటించారు. ఇప్పటివరకు  వెయ్యిరూపాయిలుగా ఉన్న ఈ భత్యం ప్రస్తుతం​ రూ.2 వేలకు చేరింది.