దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. ఈ ఘటనపై దిశ తల్లిదండ్రులు స్పందించారు. నిందితులకు తగిన శిక్ష పడిందని అన్నారు. దిశకు ఇప్పుడు తగిన న్యాయం జరిగిందని.. అందుకు సంతోషం వ్యక్తం చేశారు తల్లిదండ్రులు. ఇకపై ఇలాంటి మళ్లీ పునరావృతం జరగకుండా ఉండాలని కోరుకుంటున్నట్లు వారు తెలిపారు. ముందు తాము ఫిర్యాదు చేసినప్పుడు పట్టించుకోని పోలీసులు.. ఇప్పుడు కరెక్ట్ పని చేశారని అన్నారు. ఈ దెబ్బతో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారికి వణుకు పుట్టాలని దిశ తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే.. మా కూతుర్ని ఇంత అమానుషంగా అత్యాచారం చేసి.. హత్య చేసిన నిందితుల డెడ్ బాడీస్ని మాకు చూడాలని ఉందని వారు పేర్కొన్నారు.
ఎన్కౌంటర్తో ఇలాంటి ఘటనలు పునరావృతం కావనుకుంటున్నానంటూ.. దిశ సోదరి స్పందించింది. టీఎస్ ప్రభుత్వానికి, పోలీసులకు అభినందనలు తెలిపింది. మా అక్కకు తగిన న్యాయం జరిగిందని.. నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పింది దిశ సోదరి.
దిశ హత్యాచారం కేసులో నిందితులను ఎన్కౌంటర్ చేశారు పోలీసులు. సీన్ రీ కన్స్ట్రక్షన్ చేస్తుండగా.. నలుగురు నిందితులు తప్పించుకునేందుకు పరుగులు పెట్టారు. దీంతో.. పోలీసులు వారిని ఎన్కౌంటర్ చేశారు దిశ హత్యాచారం కేసులో.. జొల్లు శివ, మహమ్మద్, జొల్లు నవీన్, చెన్నకేశవులు మృతి చెందారు. ఎక్కడైతే.. దిశ మరణించిందో.. అదే ప్రదేశంలో.. పోలీసులు నిందితులను ఎన్కౌంటర్ చేశారు.
దిశ హత్యాచార వివరాలు: